మహబూబ్నగర్ మెట్టుగడ్డ, జనవరి 13 : జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖానకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ అన్నారు. ప్రభుత్వ జనరల్ దవాఖానను శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఐసీయూ, అత్యవసర విభాగంతోపాటు, మాతాశిశు సంరక్షణ కేం ద్రం, జనరల్ ఓపీ, డిస్పెన్సరీ, ఎంసీహెచ్ డ్రగ్స్టోర్ తదితర విభాగాలను పరిశీలించి వైద్యసేవలపై ఆరా తీశారు. అలాగే ఓపీ లో రోజూ వస్తున్న రోగులు, ఇన్పేషంట్స్తోపాటు ఎంసీహెచ్ డ్రగ్ స్టోర్లో రిజిస్టర్ల నిర్వహణ ను పరిశీలించారు.
అనంతరం డాక్టర్లతో సమావేశమై మాట్లాడారు. దవాఖానకు వచ్చే ప్రజలకు వైద్యులు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. మందుల కో సం ఎవరూ బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. దవాఖానలో పారిశుధ్యం లోపించకుండా చూడాలని, సిబ్బం ది సమయపాలన పాటించాలని ఆదేశించారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ శామ్యూల్, ఆర్ఎంవో ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.