వానకాలంలో సీజనల్ వ్యాధులపై జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా రోగాలబారిన పడక తప్పదు. దోమలు, ఈగలు వ్యాప్తి చెందకుండా చూడాలి. మెదడువాపు, చికున్గున్యా, డెంగీ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలి. శరీరాన్ని మొత్తం కప్పి ఉంచే దుస్తులు వేసుకోవాలి. పరిసరాలు, స్వీయ పరిశుభ్రత పాటించాలి.
ముఖ్యంగా చిన్నారులకు జ్వరం వస్తే వెంటనే దవాఖానకు తీసుకెళ్లి వైద్య పరీక్షలు చేయించాలి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ అధికారులు ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. సర్కారు దవాఖానల్లో మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచారు. వైద్యారోగ్య శాఖ అధికారులు ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తున్నారు. వ్యాధి లక్షణాలు తక్కువగా ఉన్నప్పుడే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు. ఇండ్లల్లో నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని హెచ్చరిస్తున్నారు.
– వనపర్తి/కొల్లాపూర్/నారాయణపేట టౌన్/హన్వాడ, జూలై 30
వనపర్తి/కొల్లాపూర్/నారాయణపేట టౌన్/హన్వాడ, జూలై 30 : వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు సోకకుండా జాగ్రత్తలు పాటించాల ని సంబంధిత అధికారులు సూచిస్తున్నారు. వ్యాధుల సీజన్లో జాగ్రత్తలు పాటిస్తేనే ఆరోగ్యంగా ఉంటామంటున్నారు. ఈ సీజన్లో ప్రధానంగా మెదడువాపు, చికున్ గున్యా, డెంగీ ప్రబలే అవకాశం ఉంటుంది. జాగ్రత్తలే శ్రీరామరక్ష అని వైద్యులు సూచిస్తున్నారు. వ నపర్తి జిల్లాలో 16 డెంగీ, 6 మలేరియా హైరిస్క్ ప్రాంతాలను గుర్తించి అక్కడ సీజనల్ వ్యాధులు ప్రజలకుండా వైద్య, ఆరోగ్యశాఖ చర్యలు తీసుకుంటున్నది.
సీజనల్ వ్యాధులపై సమీక్షలు
ఈ నెల 10వ తేదీన వనపర్తి కలెక్టరేట్లో కలెక్టర్ తేజస్ నందలాల్ జిల్లాస్థాయి సమన్వయ కమిటీతో సమావేశాన్ని నిర్వహించారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు స లహాలు, సూచనలను చేశారు. నారాయణపేటలో మే, జూ న్లో డీఎంహెచ్వో రాంమనోహర్రావు ఆధ్వర్యంలో జిల్లాలోని వైద్యాధికారులు, ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు, వైద్య సిబ్బందితో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి సీజనల్ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై దిశా నిర్దేశం చేశారు.
అవగాహన..
వర్షాలు కురుస్తున్నందున ఆయా గ్రామాల్లో ఏఎన్ఎంలు, కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, ఆశ, అంగన్వాడీలు సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షపునీరు, మురుగు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని సూచిస్తున్నారు. రోడ్ల మీద ఉన్న పదార్థాలను తీసుకోరాదని, తినే ఆహారంపై ఈగలు వాలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అవగాహన కల్పిస్తున్నారు.
మలేరియా లక్షణాలు..
ప్లాస్మోడియం పరాన్నజీవి ఆడ అనాఫిలస్ దోమ ద్వారా ఇది వ్యాప్తి చెందుతుంది. మురుగు, పంట కాలువలు, చెరువులు, కుంటలు, పొలాల్లో దోమలు వృద్ధి చెంది రాత్రి వేళ ఎక్కువగా కుడతాయి. దీంతో జ్వరం, ఒళ్లునొప్పులు వస్తాయి. ఇది అంత ప్రమాదకరమైనది కాదు. కానీ రెండో రకం ప్లాస్మోడియం ఫాల్సీపారమ్ దోమ కుట్టిన 10 నుంచి 14 రోజుల తరువాత లక్షణాలు కనిపిస్తాయి. రోజు విడిచిరోజు జ్వరం వస్తుంది. తలనొప్పి, ఒళ్లునొప్పులు, చలిజ్వరం, చెమటలు పట్టడం, కొన్ని సందర్భాల్లో వాంతులు అవుతాయి.
డయేరియా లక్షణాలు..
కలుషిత నీరు, ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతుంది. వాంతులు, విరేచనాలు అవుతాయి. కడుపునొప్పి, దాహం, చర్మం ముడతలు పడడం, నోరు ఎండిపోవడం, మూత్ర విసర్జన తగ్గుతుంది.
పాటించాల్సిన జాగ్రత్తలు :
పరిసరాలు, వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. క్లోరిన్ కలిపిన నీటిని వినియోగించాలి. భోజనానికి ముందు, మలవిసర్జన తరువాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి.
డెంగీ వ్యాధి లక్షణాలు
దోమ ద్వారా డెంగీ వైరస్ వ్యాప్తి చెందుతుంది. దోమ కుట్టిన తర్వాత 5 నుంచి 8 రకాల లక్షణాలు కనిపిస్తాయి. ఉన్నట్టుండి జ్వరం ఎక్కువగా వస్తుంది. తలనొప్పి అధికమవుతుంది. కంటి కదలికల సమయంలో భరించలేని నొప్పి ఉంటుంది. కండరాలు, కీళ్ల నొప్పులతోపాటు వాంతులు అయినట్లుగా ఉంటుంది.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
బోధకాల వ్యాధి లక్షణాలు
తరుచూ కొద్దిపాటి జ్వరంతోపాటు ఆయాసం రావడం ఈ వ్యాధి ప్రాథమిక లక్షణాలు. పురుషుల్లో వరి బీజం ఏర్పడుతుంది. ఈ వ్యాధిని నిర్ధ్దారించేందుకు రాత్రి వేళ రక్త నమూనాలను సేకరిస్తారు. బాధితుడు విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో పరాన్నజీవులు రక్త ప్రసరణ వ్యవస్థలోకి ప్రవేశించి వాటి ఉనికిని వేగంగా చూపుతాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
మెదడువాపు లక్షణాలు
ఇది వైరస్ వల్ల వ్యాపిస్తుంది. మెదడువాపును కలిగించే దోమలు పందుల మీద నుంచి ఆరోగ్యవంతులను కుట్టడం వల్ల వైరస్ సంక్రమిస్తుంది. దోమ కుట్టిన పది రోజుల తర్వాత వ్యాధి లక్షణాలు బయట పడుతాయి. ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాప్తి చెందుతుంది. ముఖ్యంగా 1-14 ఏండ్ల వయస్సులోపు వారికి సోకే అవకాశం ఉన్నది. ఆకస్మికంగా ఎక్కువ తీవ్రతతో జ్వరం రావడం, కొన్నిసార్లు ఫిట్స్ కూడా వస్తాయి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు
చికున్ గున్యా లక్షణాలు
నిర్లక్ష్యం చేయొద్దు
ప్రజలు సీజనల్ వ్యాధుల బారినపడకుండా జాగ్రత్తలు పాటించాలి. ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దోమలు వృద్ధి చెందే ప్రాంతాల్లో నివారణ మందులు స్ప్రే చేయాలి. పరిశుభ్రతతోనే ఆరోగ్యంగా ఉంటారు. వాతావరణ మార్పుల కారణంగా విషజ్వరాలు వస్తాయి. జ్వరం వచ్చిన వెంటనే సమీపంలో ఉన్న పీహెచ్సీలకు వెళ్లి పరీక్ష చేయించుకోవాలి. అన్ని రకాల జ్వరాలకు సర్కారు దవాఖానలో పరీక్షలు చేస్తారు. సీజనల్ వ్యాధులపై ప్రజలు నిర్లక్ష్యం వహించొద్దు. గ్రామాల్లోని ప్రజలకు వైద్య సిబ్బందితో అవగాహన కల్పిస్తున్నాం.
– చంద్రశేఖర్, పీహెచ్సీ వైద్యుడు, పెంట్లవెల్లి
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
అత్యవసరమైతే తప్పా బయటకు రావొద్దు. ఈ సీజన్లో జ్వరం వస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. దోమల నివారణకు కాయిల్స్, లిక్విడ్స్కు బదులు దోమతెరలు వినియోగిస్తే మంచి ఫలితముంటుంది. పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
– రవిశంకర్, డీఎంహెచ్వో, వనపర్తి
ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం..
వర్షాకాలంలో వ్యాధుల బారిన పడకుండా వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించాం. గ్రామస్థాయిలో వైద్య సిబ్బందితో సీజనల్ వ్యాధులపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. పీహెచ్సీలు, సబ్ సెంటర్లలో మందులు, జింక్, ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచాం. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు ర్యాపిడ్ రెస్పాన్స్ టీంలను సిద్ధంగా ఉంచాం. పరిసరాలతోపాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా వ్యాధులను అరికట్టవచ్చు.
– రాంమనోహర్రావు, డీఎంహెచ్వో, నారాయణపేట