కొత్తకోట, నవంబర్ 9 : పని చేయకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఓట్లు అడిగితే ఆ పార్టీని బొంద పెట్టాలని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. పామాపురం గ్రామంలోని భక్తాంజనేయస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి మాట్లాడుతూ తొమ్మిదిన్నర సంవత్సరాల కాలంలో చేసి న అభివృద్ధిని చూసి తాము ధైర్యంగా ఓట్లు అడుగుతున్నామన్నారు. కాంగ్రెస్ వస్తే రాష్టంలో అంధకారం నెలకుంటుందని, పక్కన కర్ణాటక రాష్ట్రంలో ఆరు నెలలకే చేతులెత్తిసి రైతులను కష్టల్లోకి నెట్టిందన్నారు. సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారంటే మాట తప్పరని, ఇవ్వని హామీలను కూడా నెరవేర్చి చూ పిన ఘనత సీఎం కేసీఆర్కు దక్కుతుందన్నారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అభివృద్ధిని చూసి ప్రదీప్కుమార్గౌడ్ అనుచరులు నరోత్తంరెడ్డి, రా ఘవేందర్గౌడ్, జనార్దన్గౌడ్, కావలి రాజేశ్వర్, గోపాల్, మహేశ్, శ్రావణ్కుమార్రెడ్డితోపాటు బీ జేపీ నాయకులు ఆనంద్గౌడ్, 150 మంది ఎమ్మె ల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమం లో జెడ్పీవైస్ చైర్మన్ వామన్గౌడ్, సీడీసీ చైర్మన్ చె న్నకేశవరెడ్డి, ఎంపీపీ గుంతమౌనిక, జన్నుపద్మావ తి, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్రెడ్డి, వాసుదేవారెడ్డి, విశ్వేశ్వర్, ప్రశాంత్, బాలకృష్ణ, కొండారెడ్డి, భీంరె డ్డి, వెంకటేశ్వర్రెడ్డి, గోవిందునాయుడు ఉన్నారు.
దేవరకద్ర, నవంబర్ 9 : రాష్ట్ర ప్రజలు ప్రతి పక్ష నాయకుల కల్లబొల్లి మాటలను నమ్మేస్థితిలో లేర ని, మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో కి వస్తుందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెం కటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ వేసి న అనంతరం కార్యకర్తలతో స్థానిక శ్రీనివాస గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఏర్పాటు చేసి న కార్యకర్తల సమావేశంలో అయన మాట్లాడా రు. ముచ్చటగా మూడోసారి తెలంగాణ సీఎంగా కేసీఆర్ బాధ్యతలు చేపడుతారని ధీమా వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్త ఎన్నికల సందర్భంగా 20 రోజులు గ్రామాల్లో కష్టపడి పని చేస్తే ఐదు సంవత్సరాలపాటు ప్రతి కార్యకర్త కు తాను అండగా ఉంటానన్నారు. ప్రతి కార్యకర్త గ్రామంలోని ఇంటింటికీ తిరిగి ప్రభుత్వం అందజేసిన సంక్షేమ పథకాలపై ప్రజలకు వివరించి ఈ సారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వా త ఎంతో అభివృద్ధి చెందుతుందన్నారు. రైతులకు సరైన సమయంలో రైతుబంధు అందుతుండటం తో రైతులు సంతోషంగా ఉంటే కాంగ్రెస్ నాయకులు చూడలేకపోతున్నారని అవేదన వ్యక్తం చేశా రు. అభివృద్ధి చేస్తున్న ప్రభుత్వంపై ఎన్ని అరోపణలు చేసిన ప్రజలు నమ్మడం లేదని ఎన్ని జిమికులు చేసిన తెలంగాణలో మూడోసారి బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తాందన్నారు. సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ పాలనలో దేవరకద్ర నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందన్నారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు, వివిధ పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. గురువారం స్థానిక శ్రీనివాస గార్డెన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రె స్, బీజేపీ పార్టీలకు చెందిన కార్యకర్తలు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేశామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు చెపెవని అబద్దాలేన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ స్వర్ణ మ్మ, ఎంపీపీలు రమాదేవి, గుంతమౌనిక, భీంరె డ్డి, కదిరేశేఖర్ రెడ్డి, హర్షవర్ధన్రెడ్డి, మార్కెట్ కమి టీ చైర్మన్ విజయవెంకటేశ్, సహాకర సంఘం అధ్యక్షుడు డోకూర్ నరేందర్రెడ్డి, మూడా డైరెక్టర్ రాజు, మండలాధ్యక్షుడు జెట్టి నర్సింహారెడ్డి, మండల కోఅప్షన్ ఖదీర్పాషా, నాయకులు ప్రదీప్కుమార్ గౌడ్, శ్రీకాంత్యాదవ్, కొండారెడ్డి, శ్రీనివాస్రెడ్డి, ఆంజనేయులు, రంగయ్యగౌడ్, సత్యంసాగర్, వెంకటేశ్, బాలరాజు, భాస్కర్రెడ్డి, శివనంద్, చాల్మరెడ్డి,యుగేందర్రెడ్డి పాల్గొన్నారు.
మూసాపేట, నవంబర్ 9 : బీఆర్ఎస్ పార్టీ ఎ మ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి గు రువారం నామినేషన్ సందర్భంగా దేవరకద్ర గులాబీ మయంగా మారింది. ఎమ్మెల్యే ఆల నా మినేషన్ వేయనున్నట్లు బుధవారం సాయంత్రం ఎమ్మెల్యే ఆల కాన్ఫరెన్స్ ద్వారా ఫోన్కాల్ మాట్లాడుతూ నాయకులకు సమాచారం ఇచ్చారు. దీం తో నియోజకవర్గ కేంద్రంతోపాటు భూత్పూర్, మూసాపేట, అడ్డాకుల, కొత్తకోట, మదనాపూర్, చిన్నచింతకుంట, కౌకుంట్ల మండలాల నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు స్వచ్ఛందంగా తరలివచ్చారు. ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నాసాగర్ నుంచి మూసాపేట వేముల స్టేజీ జాతీయ ర హదారిపై ఉన్న ఆంజనేయస్వామి ఆలయం నుం చి దేవరకద్రకు వెళ్లారు. నామినేషన్ అనంత రం దేవరకద్రలో కుటుంబ సభ్యులు, కార్యకర్తలు గె లుపు శుభాకాంక్షలు తెలియజేశారు. అక్కడి నుం చి భారీ ఊరేగింపుతో ర్యాలీ నిర్వహించారు. దీం తో దేవరకద్ర పట్టణం అంతా గులాబీ మ యంగా మారింది. తనపై ఉన్న అభిమానంతో వచ్చిన ప్రతిఒక్కరికీ ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు.