మూసాపేట(అడ్డాకుల), మార్చి 22 : మండలంలోని కందూరు రామలింగేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని శుక్రవారం ఆలయ ప్రాంగణంలో బండలాగుడు పోటీలను నిర్వహించారు. దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్రెడ్డి పోటీలను ప్రారంభించారు. పోటీల్లో మొదటి బహుమతి కర్నూల్ జిల్లా వంకూరుకు చెందిన తిరుమలేశ్ రూ.40వేలు, రెండో బహుమతి గద్వాలకు చెందిన గోసాయి వినిల్రాయుడు రూ.30వేలు, మూడో బహుమతి వనపర్తి జిల్లా పెద్దదగడకు చెందిన గోపాల్కృష్ణ రూ.20వేలు, నాలుగో బహుమతి మానవపాడుకు చెందిన రవీందర్రెడ్డి రూ.15 వేలు, ఐదో బహుమతి కర్నూల్కు చెందిన జాకీర్పాషా రూ.10 వేలు గెలుపొందారు. వీరికి ఎమ్మెల్యే బహుమతులు అందజేసి సన్మానించారు. కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు పాల్గొన్నారు.