మహ్మదాబాద్, ఆగస్టు 2 : మండలంలోని చౌదర్పల్లిలో ప్రఖ్యాతిగాంచిన బలభీమాంజనేయ స్వామి ఆలయాన్ని అద్భుతంగా నిర్మించాలని ఆలయ ట్రస్ట్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్రెడ్డి తెలిపారు. మంగళవారం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఏడాది డిసెంబర్లో వారం రోజులపాటు జరిగే ఉత్సవాలకు కర్ణాటక, హైదరాబాద్, మహారాష్ట్ర నుంచి కూడా భక్తులు అధికంగా వస్తారన్నారు.
ఆలయానికి పురాతన చరిత్ర ఉండడంతో తమ కుటుంబసభ్యులు అభివృద్ధికి పాటు పడుతున్నారని చెప్పారు. ఈ ఏడాది జాతర నాటికి ఆలయ నిర్మాణం చేపట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళ్తున్నామన్నారు. యాదాద్రి, తిరుపతి ఆలయాలకు ఉపయోగించిన శిల్పాలతో పనులు చేపడుతున్నామన్నారు. గ్రామస్తులు, యువకులు సహకారం అందిస్తున్నారన్నారు. కార్యక్రమంలో సుంకిరెడ్డి కృష్ణారెడ్డి, సుభాషిణి, నవీన, రాజేందర్రెడ్డి, సతీశ్రెడ్డి, గ్రామస్తులు ముకుందం, కిష్టయ్య, భీమయ్య, బాలస్వామి, భీంశంకర్, సంతోశ్, యువకులు తదితరులు పాల్గొన్నారు.