గద్వాల అర్బన్, ఏప్రిల్ 5 : ఉప ప్రధాని, కార్మిక శాఖ మంత్రిగా దేశ అభివృద్ధి ప్రదాతగా బాబూ జగ్జీవన్ రామ్ ఎంతో కృషి చేశారని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం బాబూ జగ్జీవన్రామ్ జయంతిని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగాఎమ్మెల్యే మాట్లాడుతూ బాబూ జగ్జీవన్ రామ్ బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, నిరంతర కృషి వలుడని కొనియాడారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాబర్, నాయకులు నాగర్దొడ్డి వెంకట్రాములు, ఎంపీపీ విజయ్కుమార్, గడ్డం కృష్ణారెడ్డి, రామేశ్వరమ్మ, మురళి తదితరులు ఉన్నారు.