మరికల్, జనవరి 29 : రాష్ట్రంలోనే అన్ని వసతులు కలిగిన ఆయుర్వేద వైద్యశాలను సోమవారం మరికల్ మండలంలోని కన్మనూర్ గ్రామంలో మహబూబ్నగర్ ఎంపీ మన్నే శ్రీనివాస్రెడ్డి, మహబూబ్నగర్ జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి, మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, నారాయణ పేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మట్లాడుతూ రూ.50 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆయుర్వేద వైద్యశాలలో పక్షపాతం, అర్షమొలలు, మధుమేహం, స్త్రీలకు సంబంధించిన వ్యాధులు, కీళ్లనొప్పులు తదితర వాటికి ఆయుర్వేద చికిత్సలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కేరళ తరహాలో నూనెతో మసాజ్ చేసి స్టీంతో చికిత్సలు చేసి వ్యాధులను నయం చేస్తారని వివరించారు. కార్యక్రమంలో కన్మనూర్ సర్పంచ్ శరత్చంద్రారెడ్డి, ఎంపీటీసీ రాజు, ఆయుష్ డైరెక్టర్ ప్రశాంతి, డాక్టర్ వసంత్రావు, డాక్టర్లు పరమేశ్వర్ నాయక్, హేమలత, రఘుకుమార్, మహేందర్, వెంకటాపూర్ సర్పంచ్ కళావతమ్మ, ధన్వాడ సింగిల్విండో చైర్మన్ వెంకట్రామిరెడ్డి, ఎంపీటీసీ సునీత, నాయకులు వీరన్న, విజయ్కుమార్, ప్రతాప్రెడ్డి, వీనితమ్మ తదితరులు పాల్గొన్నారు. అనంతరం మరికల్ మండలం వెంకటాపూర్లో సోమవారం రాత్రి పేట ఎమ్మెల్యే పర్ణికారెడ్డి జీపీ భవనానికి భూమి పూజ నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.
మక్తల్, జనవరి 29 : జిల్లాలోని నారాయణపేట, కొండంగల్ నియోజకవర్గాలకు సాగునీరు అందించే పేట, కొండంగల్ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాలని పౌరసరాపరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి జిల్లా ఎమ్మెల్యేలు వినతిపత్రాన్ని అందించారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఉమ్మడి మహాబూబ్నగర్ జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి, సీడబ్య్లూసీ ప్రత్యేక ఆహ్వానితులు వంశీ చందర్రెడ్డి, ఉమ్మడి జిల్లా ఎమ్మెల్యేలు వాకిటి శ్రీహరి, యెన్నం శ్రీనివాస్రెడ్డి, మధుసూదన్రెడ్డి, పర్ణికారెడ్డి, కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షడు శివకుమార్రెడ్డి చర్చించారు. 2014 మే 23న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పేట ,కొండంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి జీవో జారీ చేసింది. ఈ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టితే కొడంగల్, నారాయణపేట నియోజకవర్గాలకు సాగునీరు అందుతుందని తెలిపారు.
మక్తల్ నియోజకవర్గంలో రాజీవ్భీమా ఎత్తిపోతల పథకం కింద సంగంబండ, భూత్పూర్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ల కింద ముంపు బాధితులకు పరిహారం చెల్లించాలని మక్తల్ ఎమ్మెల్యే మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డికి వినతిపత్రం అందజేశారు. దీనిపై మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.