పాలమూరు, జూలై 14 : మహబూబ్నగర్ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో శుక్రవారం జెడ్పీ చైర్పర్సన్ చాంబర్లో జెడ్పీ రెండో స్థాయి స్టాండింగ్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణాసుధాకర్రెడ్డి మాట్లాడు తూ ప్రభుత్వ పథకాలపై లబ్ధిదారులకు అవగాహన కల్పించాలన్నారు. అదేవిధంగా గ్రామీణ అభివృద్ధి సమావేశంలో కోయిలకొండ జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డితో కలిసి సమీక్షించారు. ప్ర భుత్వం చేనేత కార్మికులకు కల్పించిన రూ.5లక్షల బీమా, నూ లుపై సబ్బిడీ ఇతర లోన్లపై అవగాహన కల్పించాలని చేనేత, జో లి శాఖ అధికారులను కోరారు. సెల్ఫ్ ఎంప్లాయిమెంట్ స్కీం ద్వారా యువతకు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా చూడాలన్నారు. అదేవిధంగా ఈజీఎస్ ద్వారా ఉపాధి పనులు కల్పించాలన్నారు. గిరి వికాసంలో వేయించిన బోర్లకు విద్యుత్ కనెక్షన్లతోపాటు ట్రాన్స్ఫార్మర్లను ఇస్తే బాగుంటుందన్నారు.
చిరుధాన్యాలపై..
చిరుధాన్యాలపై రైతులకు అవగాహన కల్పించాలని జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య అన్నారు. శుక్రవారం సీఈవో ఛాంబర్లో ని ర్వహించిన మూడో స్థాయి సంఘం వ్యవసాయం అంశంపై స మావేశంలో చిన్నచింతకుంట జెడ్పీటీసీ రాజేశ్వరీ, కోఆప్షన్ సభ్యుడు అల్లావుద్దీన్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రత్యమ్నాయ పంట ల వైపు మళ్లించేందుకు అధికారులు దృష్టి సారించాలన్నారు. పంటల మార్పిడిపై రైతులకు అవగాహన కల్పించాలని, చిరుధాన్యాల పంటలు వేయడంతో భూసారం పెరుగుతుందని, చిరుధాన్యాలకు మార్కెట్లో డిమాండ్ ఉన్నాయని తెలిపారు. విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచాలని నాణ్యమైన, నకిలీ విత్తనాలపై దృష్టి సాధించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు.
సీజనల్ వ్యాధులపై..
సీజనల్ వ్యాధులు అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జెడ్పీ చైర్ పర్సన్ స్వర్ణ సుధాకర్రెడ్డి అన్నారు. నాలుగో స్టాండింగ్ కమిటీ సమావేశంలో విద్య, వైద్యం గురించి జెడ్పీ కోఆప్షన్ అ న్వర్హుస్సేన్తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సీజనల్ వ్యాధులు రాకుండా చర్యలు తీసుకోవాలని దోమల నివారణకు గ్రామాల్లో నీరు నిల్వ ఉండకుండా చూ డాలన్నారు. కంటి వెలుగు పథకం ద్వారా కంటి పరీక్షలు నిర్వహించి ఉచితంగా కంటి అద్దాలు అందజేశామన్నారు. ధూమపానం నివారణకు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న ఉచిత పుస్తకాలు ప్రతి విద్యార్థికీ అందేలా చూడాలన్నారు. అదేవిధంగా మన ఊరు మనబడి పథకం ద్వారా పాఠశాలలో సదుపాయాలు మెరుగుకావడంతో నో అడ్మిషన్ బోర్డు పదిహేను స్కూల్లో పెట్టడం జరిగిందన్నారు
రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
మహిళలు ప్రభుత్వం ఇచ్చే రుణాలు సద్వినియోగం చేసుకోవాలని మహబూబ్నగర్ జెడ్పీటీసీ వెంకటేశ్వరి అన్నారు. స్త్రీ శిశు సంక్షేమంపై సీఈవో చాంబర్లో హన్వాడ ప్రాదేశిక సభ్యులు విజయనిర్మలతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా సంఘాలకు ప్రభుత్వం ఇచ్చే బ్యాంకు రుణాలను సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. మహిళా సంరక్షణ చట్టాలపై అవగాహన కల్పించాలని, రుణాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమాల్లో జెడ్పీ సీఈవో జ్యోతి, ఆయా శాఖల అధికారులు, జెడ్పీ సూపరింటెండెంట్ ఆనంద్, సిబ్బంది పాల్గొన్నారు.