వనపర్తి/బాలానగర్/గద్వాల టౌన్, జూలై 31 : ప్రతి ఏడాది ఆగస్టు 1 నుంచి తల్లిపాల వారోత్సవాలు ప్రారంభమవుతాయి. బిడ్డ పుట్టిన గంటలోపే పాలిచ్చేలా తల్లికి సాయం చేయాలన్నదే వారోత్సవాల ఉద్దేశం. అమ్మపాలు అమృతం, నవజాత శిశువు ఆరోగ్యంగా పెరగడానికి తల్లిపాలు ఎంతగానో దో హదపడతాయి. ప్రకృతి సిద్ధంగా లభించే పా లు బిడ్డకు ఎంతో మేలు చేస్తాయి. తల్లి పాల ల్లో వివిధ రకాల పోషకాలుంటాయి. అవి శిశువు పెరుగుదలకు ఉపకరిస్తాయి. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే అ పోహలు వీడి తప్పకుండా బిడ్డకు పాలు ప ట్టించాలి. పుట్టిన వెంటనే బిడ్డకు గంటలోపు ముర్రుపాలు పట్టిస్తే సహజ రోగ నిరోధక శక్తి కలిగేలా చేస్తాయి.
అందుకే తల్లిపాలను అ మృతంతో పోలుస్తారు. లేత పసుపుపచ్చ రం గుతో కూడిన పాలను బిడ్డకు ఇవ్వడం వల్ల పసికందు మెదడు చురుకుగా పని చేయడంతోపాటు జ్ఞాపక శక్తి పెరిగేందుకు దోహదపడుతుంది. గుండె, చర్మ, సంబంధ వ్యాధు లు, ఉబ్బసం, ఆస్తమా, బీపీ, షుగర్ రాకుం డా చేస్తాయి. ఆరు నెలల పాటు శిశువుకు రో జుకు 12 సార్లు పాలు తాగించాలి. ఈ పాలు తాగిన పిల్లల్లో స్థూలకాయం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. కొందరు తల్లులు తమ బిడ్డలకు డబ్బా పాలు పడుతున్నారు. అలా చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. మంగళవారం నుంచి 8వ తేదీ వరకు తల్లిపాల వారోత్సవాల్లో భాగంగా మండల కేం ద్రంతోపాటు ఆయా గ్రామాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
తల్లిపాలతో కలిగే ప్రయోజనాలు
తల్లిపాలతో బిడ్డకు ప్రోటీన్లు అంది మెదడు వికసించడంతోపాటు శిశువుకు సమత్యులమైన ఆహారం అందుతుంది. బిడ్డకు అవసరమయ్యే విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. పాలల్లో లాక్టోజ్ ఉండటంతో కాల్షియం నిల్వలు పెరుగుతాయి. దీంతో బిడ్డ రక్తహీనత బారినపడకుండా ఉంటుంది. తొలిదశలో శిశువును అంటువ్యాధుల నుంచి కాపాడటమే కాకుండా మనోవికాసానికి తోడ్పడతాయి. నిమోనియా, డయేరియా వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి కాపాడవచ్చు. క్యాన్సర్, గుండె జబ్బులు, చెవికి సంబంధించిన వ్యాధుల నుంచి రక్షణనిస్తాయి. ఆస్తమా, ఎలర్జీ, డయాబెటిస్ వంటి వ్యాధులు దరిచేరవు. పోషకాహార లోపం తగ్గి శిశు మరణాలు కూడా తగ్గే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు.
తల్లికి కలిగే ప్రయోజనాలు
బిడ్డకు ముర్రుపాలు పట్టడం వల్ల గర్భధారణ తర్వాత రక్తస్రావ ప్రమాదం తగ్గి త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్లో రొమ్ము, అండాశయ క్యాన్స ర్లు, మధుమేహం వచ్చే అవకాశం తక్కువగా ఉంటుం ది. జీవితాంతం ఆరోగ్యంగా ఉంటారు. ఊబకాయం నుంచి తప్పించుకోవచ్చు. గర్భదారణకు పూర్వం ఉండే బరువును మళ్లీ పొందవచ్చు. తల్లిపాలు పుష్కలంగా రావాలంటే గర్భిణిగా ఉన్నప్పటి నుంచి పోషక విలువల ఉన్న ఆహారాన్ని తీసుకోవాలి. గుడ్లు, చేపలు, పాలు, తాజా కూరగాయాలు, పండ్లు తీసుకోవాలి.
ఇవీ కార్యక్రమాలు..
8వ తేదీ వరకు వారోత్సవాలు
బిడ్డకు సరిపడా పాలు ఉండాలంటే గర్భంతో ఉన్నప్పుడే తల్లి పౌష్టికాహారం తీసుకోవాలి. ప్రోటీన్లు ఉండే పాలు, చేపలు, గుడ్లు, పండ్లు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల బిడ్డకు సరిపడా పాలు పుష్కలంగా లభిస్తాయి. ఈనెల 8వ తేదీ వరకు నిర్వహిస్తున్న తల్లిపాల వారోత్సవాలను విజయవంతం చేయాలి. ఏడు రోజులపాటు తల్లి ఆవశ్యతకపై గర్భిణులు, బాలింతలకు అవగాహన కల్పిస్తాం. అంగన్వాడీ కేంద్రాల్లో ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి వివరిస్తూ గ్రామాల్లో ర్యాలీలు నిర్వహిస్తాం. సాంస్కృతిక కళాకారులతో తల్లిపాలపై ఆటాపాటల రూపంలో అవగాహన కల్పిస్తాం.
– సునీత, ఐసీడీఎస్ సూపర్ వైజర్, బాలానగర్
తల్లికి లాభం, బిడ్డకు క్షేమం
ప్రసవమైన వెంటనే బిడ్డకు ఎంత తొందరగా పాలు ఇస్తే అంత మంచిది. తల్లి దగ్గరలో ఉంచడంతో బిడ్డ శరీర ఉష్ణోగ్రతను పెంచుతుంది. అదేవిధంగా తల్లికి పాలు రావడానికి ప్రేరణ కలుగుతుంది. తల్లీబిడ్డల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరుగుతాయి. పాలు ఇవ్వడం వల్ల తల్లికి ప్రసవానంతరం బరువు తగ్గేందుకు అవకాశం ఉంది. మానసిక ఒత్తిడి తగ్గించి బాలింత దశలో రక్తస్రవాన్ని తగ్గిస్తుంది. రొమ్ము, అండాశయ క్యాన్సర్ వంటివి రాకుండా బాలింతను కాపాడుతుంది.
– చంద్రమోహన్, చిన్నపిల్లల వైద్యుడు, వనపర్తి