మహబూబ్నగర్ టౌన్, జనవరి 22 : మహబూబ్నగ ర్ పట్టణం కొత్త రూపు సంతరించుకుంటున్నది. ఇప్పటికే మంత్రి శ్రీనివాస్గౌడ్ మహబూబ్నగర్ సుందర పట్టణం గా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నారు. రూ.10 కోట్ల వ్యయంతో చౌరస్తాల సుందరీకరణ పనులు చేపట్టా రు. మరికొన్ని చౌరస్తాల పనులు చేపడుతున్నారు. అశోక్టాకీస్ చౌరస్తా నుంచి క్లాక్ టవర్ వరకు రోడ్డు విస్తరణ ప నులు జరుగుతున్నాయి. మినీట్యాంక్బండ్పై సస్పెన్షన్ బ్రి డ్జి పనులు, ఐలాండ్, శిల్పారామం పనులు చేపడుతున్నా రు. మహబూబ్నగర్ సిగలో మరో నగ కళాభారతి ఆడిటోరియం నిర్మాణ పనులు చేపడుతున్నారు. రూ.7కోట్ల వ్యయంతో అన్ని ఆధునిక హం గులతో ఆడిటోరియం నిర్మిస్తున్నారు. గ తంలో నిర్మించిన టౌన్హాల్ చిన్నదిగా ఉం డడంతో కళాకారులు ఎంతో ఇబ్బందులు పడేవారు. దీంతో నూతనంగా కళాభారతి నిర్మాణం చేపడుతుండడంతో పట్టణ వాసు లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఆడిటోరియంలో అన్ని వసతులు
కళాభారతి ఆడిటోరియంలో అన్ని హం గులతో నిర్మిస్తున్నారు. కళాకారులకు వేషధారణ కోసం ప్రత్యేక గది, నాటక రిహార్సల్కు ప్రత్యేక గదితోపాటు వసతులు కల్పించనున్నారు. అడ్వాన్స్ సౌండ్ సిస్టంతోపాటు ఆధునిక కుర్చీలను ఏర్పాటు చేయనున్నా రు. ప్రత్యేక లైటింగ్తోపాటు స్టేజీ సుందరంగా ఏర్పాటు చే యనున్నారు. పార్కింగ్ స్థలాన్ని కూడా ప్రత్యేకంగా నిర్మిం చి కళాభారతి చుట్టూ గార్డెనింగ్, మొక్కలు, స్వాగత బోర్డు లు ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే 80శాతం పనులు పూర్తి కావొచ్చాయి.
అభివృద్ధే ముందున్న లక్ష్యం
మహబూబ్నగర్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం. ఇప్పటికే ప్రధాన రోడ్డును విస్తరించం. క్లాక్ టవర్, తెలంగాణ చౌర స్తా, సద్దల గుండు, డీఈ వో చౌరస్తాను సుందరం గా తీర్చిదిద్దాం. మిగతా చౌరస్తాలను తీర్చిదిద్దుతాం. మి నీ ట్యాంక్బండ్ మరింత అభివృద్ధి చేసి శిల్పారామం, సస్పెన్షన్ బ్రిడ్జి, ఐలాండ్ పనులు చేపడుతున్నాం. కళాభారతి పనులు త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తె స్తాం. అభివృద్ధిలో అందరు భాగస్వాములు కావాలి.
– శ్రీనివాస్గౌడ్, మంత్రి
వేగంగా అభివృద్ధి
మంత్రి శ్రీనివాస్గౌడ్ కృషితో మహబూబ్నగర్ పట్టణంలో అభివృద్ధి కా ర్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. కళాభారతి ఏర్పాటుతో పురపాలిక ఆ వరణలో కొత్త కళ రానుం ది. ఇప్పటికే రోడ్డు విస్తరణ, జంక్షన్ల అభివృద్ధి చేశారు. ట్యాంక్బండ్ అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నారు. కళాభారతి పనులు త్వరగా పూర్తి చేసేందుకు అన్ని శాఖల అధికారులు కృషి చేస్తున్నారు.
-కేసీ నర్సింహులు, మున్సిపల్ చైర్మన్ మహబూబ్నగర్