మహబూబ్నగర్, నవంబర్ 30 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : భూముల రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు, ఆ స్తుల బదిలీలకు జవాబుదారీతనం, సురక్షితమైన సేవలను అందించేందుకు సర్కార్ పకడ్బందీగా ధరణి ఏ ర్పాటు చేసింది. అయితే, కొందరు అక్రమార్కులు ధ రణిని కూడా ఏమార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా రు. భూమి, స్థలానికి తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాల్సి ఉండగా.. కొందరు వాయిదా వేస్తున్నా రు. దీనిని అక్రమార్కులు అనుకూలంగా మార్చుకుంటున్నారు. అదే పేర్లు ఉన్న వ్యక్తులను రంగంలోకి దిం పి తమ పేరిట భూమిని మార్చుకొని అమ్ముతున్నా రు. కొత్తపల్లికి చెందిన మొహమ్మద్ జావిద్ తండ్రి మొహమ్మద్ గౌస్ కాగా.. మహబూబ్నగర్ పట్టణానికి చెందిన అదే పేరున్న వ్యక్తి ఆధార్ కార్డుతో ఈ కేవైసీకి దరఖాస్తు చేశారు. వ్యక్తి పేరు అదే అయినా తండ్రి పేరు మాత్రం వేరే ఉన్నా కలర్ జీరాక్స్లో మొహమ్మ ద్ గౌస్గా మార్చారు. తర్వాత ఫోర్జరీ చేసిన ఆధార్ కార్డుతో భూమిని తన పేరిట మార్చేందుకు ఈ కేవైసీ కోసం దరఖాస్తు చేసుకున్నారు. నకిలీ వ్యక్తి వద్ద ఎ లాంటి డాక్యుమెంట్ లేకపోయినా ఈ కేవైసీ పూర్తి అ యింది. ఆ భూమిని విక్రయించేందుకు స్లాట్ బుక్ చేసుకున్న విషయం తెలుసుకున్న జావిద్ మిడ్జిల్ తా సిల్దార్ కార్యాలయంలో కేటుగాడిని, భూమి కొనుగో లు చేసేందుకు వచ్చిన మొత్తం ఐదు మందిని పట్టుకున్నాడు. భూమి అసలు యజమాని జాగ్రత్త పడకుం టే వేరే వ్యక్తుల పేర రిజిస్ట్రేషన్ కూడా పూర్తయ్యేది. అ దే జరిగితే కోర్టు కేసులు అంటూ రోజులు గడిచే పరిస్థితి ఉండేది. ఇలాంటి వారిపై అధికారులు అప్రమత్తంగా ఉండాలి. ఇదిలా ఉండగా, జావిద్ విషయాన్ని ‘నమస్తే తెలంగాణ’ మహబూబ్నగర్ జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లింది. వెంటనే స్పందించిన కలెక్టర్ అస లు భూ యజమానికి అన్యాయం జరిగినట్లు గుర్తించారు. పోలీసులతో మాట్లాడి ఐదుగురిని కఠినంగా శి క్షించాలని ఆదేశించారు. అసలు భూమి యజమాని పేరును వెంటనే ధరణిలో ఎక్కించారు.
జడ్చర్ల కేంద్రంగా..
మహబూబ్నగర్, జడ్చర్ల, బాలానగర్, మిడ్జిల్ ప రిధిలో ఎకరా రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్లు ప లుకుతున్నది. చాలా మంది ధరణి తర్వాత ఈ కేవైసీ చేయించడం లేదు. మరికొందరు చనిపోయిన సందర్భాలున్నాయి. ఇలాంటి వాటిపై అక్రమార్కులు కన్నే సి తమ పేర మార్చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. జడ్చర్ల కేంద్రంగా ఓ ముఠా ఈ దందా చేస్తున్నట్లు సమాచారం. అసలు యజమాని పేరు ఉన్న మరో వ్య క్తితో ఈ కేవైసీ కోసం దరఖాస్తు చేసి.. వివరాలు మారిపోగానే డిజిటల్ పాస్ పుస్తకాలకు దరఖాస్తు చేస్తారు. పాస్బుక్ వస్తే స్లాట్ బుక్ చేసి విక్రయిస్తున్నారు.
చూసుకోకుంటే అమ్మేసేవాళ్లు..
నా భూమిని మహబూబ్నగర్కు చెందిన మొ హమ్మద్ గౌస్ ఈ కేవైసీ ద్వారా అక్రమంగా తన పేర మార్చుకున్నాడు. ఆ తరువాత వారం రోజుల్లోపే విక్రయానికి పెట్టాడు. ఆధార్లో తన తండ్రి పేరును మార్చి ఫోర్జరీ చేశారు. ఎలాంటి డాక్యుమెంట్లు, పట్టాదారు పాస్ పుస్తకం లేకుండా మా ర్చుకునేందుకు ఎలా అవకాశం వచ్చిందో అర్థం కావడం లేదు. అధికారులు కనీసం చూడకుండా ఈ కేవైసీ పూర్తి చేయడం ఆశ్చర్యం వేస్తున్నది. కష్టపడి సంపాదించిన డబ్బుతో కొన్న భూమిని వేరే వాళ్లు కాజేస్తే మా పరిస్థితి ఏంటి? జాగ్రత్త పడ్డాం కాబట్టి సరిపోయింది. లేకుంటే మేం భూమిని కో ల్పోయే పరిస్థితి వచ్చేది.
గంటల వ్యవధిలో న్యాయం చేశాం..
జావిద్ భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసేందుకు ప్రయత్నించిన అంశం మా దృష్టికి వచ్చిన వెంటనే సదరు భూమిని హోల్డ్లో పెట్టాం. నకిలీ ఆధార్ కార్డు ద్వారా నిందితులు భూమిని తమది గా మార్చుకున్నట్లు గుర్తించాం. కొన్ని గంటల వ్య వధిలోనే విచారణ చేపట్టి భూమిని అసలు యజమాని పేరిట ధరణిలో మార్పు చేశాం. జిల్లాలో ఇ ప్పటివరకు ఇలాంటివి నాలుగు కేసులు మా దృ ష్టికి వచ్చాయి. అన్ని కేసుల్లోనూ నిందితులను అ దుపులోకి తీసుకొని కేసులు నమోదు చేశాం. బాధితులకు సత్వరమే న్యా యం చేశాం. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. యజమానులు తమ భూము ల వివరాలను ధరణి పోర్టల్లో చెక్ చేసుకోవాలి. అనుమానం ఉంటే అధికారులకు ఫిర్యాదు చేయాలి.
జడ్చర్లకు చెందిన మొహమ్మద్ జావిద్ మిడ్జిల్ మండలం కొత్తపల్లి గ్రామంలో 2013లో 2.01 ఎకరాలు కొనుగోలు చేశాడు. ధరణి ఏర్పాటయ్యాక ఇటీవల పొలాన్ని ఈ కేవైసీ చేయించుకునేందుకు మీ సేవకు వెళ్లాడు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసుకున్నా ఈ కేవైసీ చేయించినట్లుగా వస్తున్నది. దీంతో ధరణి పోర్టల్లో చెక్ చేస్తే తన బదులు వేరే వ్యక్తి ఫొటో, ఆధార్ నంబర్లున్నట్లు గుర్తించాడు. నవంబర్ 27న భూమిని విక్రయించేందుకు నకిలీ వ్యక్తి స్లాట్ బుక్ చేసుకున్నాడని మీ సేవ ఆపరేటర్ ద్వారా తెలుసుకొని.. మిడ్జిల్ తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి నకిలీ వ్యక్తులను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. రెవెన్యూ అధికారులు సైతం స్పందించి కఠినంగా చర్యలు తీసుకోవాలని పోలీసులకు చెప్పారు.
మిడ్జిల్ మండలం మసిగండ్లపల్లిలో చనిపోయిన ఓ వ్యక్తి పేరిట మూడెకరాలు ఉన్నది. ఆ పొలాన్ని ఆయన మ్యుటేషన్, ఈ కేవైసీ చేయించుకోలేదు. కొంత కాలం తర్వాత ఆయన ముగ్గురు కుమారులు వలస వెళ్లారు. ఇదే అదనుగా భావించిన కొందరు ఆ పొలాన్ని తమ పేరిట మ్యుటేషన్ చేయించుకున్నారు. విషయం తెలుసుకుని అసలు వ్యక్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు.పోలీసులకు ఫిర్యాదు చేశారు.