వనపర్తి, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : పల్లెనిద్ర.. ప్రతిపక్షాలకు కునుకులేకుండా చేస్తున్నది. టీ ఆర్ఎస్ను ఓడించాలని బీరాలు పలుకుతున్న ప్రతిపక్షాలకు వనపర్తి నియోజకవర్గంలో పాలుపోలేని స్థి తి నెలకొన్నది. మంత్రి నిరంజన్రెడ్డి రాజనీతితో కాం గ్రెస్, బీజేపీ నాయకులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులుగా వె లుగబెట్టిన నాయకులకు ఎన్నికలు రాకముందే ఓట మి భయం పట్టుకున్నది. పరువుపోతుందనే ఉద్దేశం తో అప్పుడప్పుడు కార్యక్రమాలను చేస్తూ తమ ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మంత్రి ని రంజన్రెడ్డి గ్రామాల్లో పల్లెనిద్ర చేసి సమస్యలను తె లుసుకొని పరిష్కరిస్తున్నారు. అభివృద్ధిలో కాస్త వెనుకబడిన దళిత, గిరిజన గ్రామాలు, తండాల్లో పల్లెని ద్ర చేసి సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు. రో డ్లు, డ్రైనేజీలు, విద్యుత్, పింఛన్లు, తాగునీటి సమ స్య, పాఠశాలల మరమ్మతులు ఇలా మౌలిక సౌకర్యాలతోపాటు సంక్షేమంపై దృష్టి సారి స్తూ ప్రజలకు మరింత చేరువవుతున్నారు. అంతేకాకుండా జిల్లాలో కలెక్టరేట్ నిర్మాణం, రోడ్లు, మెడిక ల్, నర్సింగ్, ఇంజినీరింగ్ కాలేజీలు, ఎలక్ట్రికల్ స్టో ర్స్, మత్స్య కళాశాల, సాగునీటి లభ్యత వంటి అనేక కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. దీంతో నియోజకవర్గంలో టీఆర్ఎస్ ముందు వరుసలో ఉన్నది.నియోజకవర్గంలో టీఆర్ఎస్ను శతృదుర్భేద్యంగా మార్చడంతో ప్రతిపక్షాలు కదలలేని స్థితిలో ఉన్నాయి.
కాంగ్రెస్కు కార్యకర్తలు కూడా కరువయ్యారు. బీజేపీ పుంజుకుందామనుకునే ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ అవకాశం దొరకడం లేదు. ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ మరింత బలంగా మా రుతుంటే.. కాంగ్రెస్ పరిస్థితి మ రింత దిగజారుతున్నది. కాంగ్రెస్ జెండా పట్టుకొని తిరుగుతు న్నా కొంతమంది నాయకులు టీఆర్ఎస్కు టచ్లో ఉన్నారు. పెబ్బేరు, వనపర్తి మండలాల్లో చాలా మంది కాంగ్రెస్, బీజేపీ నాయకులు మంత్రి నిరంజన్రెడ్డితో సత్సంబంధాలు కొనసాగిస్తున్నారు. ఈ విషయం అగ్రనాయకులకు తెలిసినా.. నాయకులను నిలదీస్తే చేజారిపోతారనే భయపడి మిన్నకుండిపోతున్నారు. కార్యకర్తలకు బాధ్యతలు అప్పగించి టీఆర్ఎస్ను మరింత పటిష్టం చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా సమావేశమవుతున్నారు. యూ త్, స్టూడెంట్ వర్గాలను యాక్టివ్ చేశారు. యువతకు కీలక బాధ్యతలు అప్పగించారు. నిరుద్యోగులకు మంత్రి తన సొంత ఖర్చులతో పో టీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేలా చేశారు. సీ ఎమ్మార్ఎఫ్, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను మంత్రి స్వయంగా అందజేసి సహపంక్తి భోజనం చేస్తున్నారు. ఈ క్రమంలో పోటీ చేసేందుకు ప్రతిపక్షాలకు అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేదు. పోటీ చేయాలనుకున్న వారు కూడా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారనే ప్రచారం ఉన్నది.
టీఆర్ఎస్లోకి భారీగా వలసలు..
మంత్రి నిరంజన్రెడ్డి చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ఇతర పార్టీల కార్యకర్తలు, నాయకులను ఆకర్షిస్తున్నాయి. ఇప్పటికే రేవల్లి, గోపాల్పేట, ఖిల్లాఘణపురం, శ్రీరంగాపూర్, పెబ్బేరు, వనపర్తి మండలాల్లో కాంగ్రెస్, ఇతర పార్టీల కార్యకర్తలు, నాయకులు టీఆర్ఎస్లో చేరారు. మంత్రి సమక్షంలో చేరికలు నిత్యకృత్యమవుతున్నాయి. పార్టీ పటిష్టతకు కృషిచేసే వారికి గుర్తింపునిస్తూ కీలక బాధ్యతలు అప్పజెబుతున్నారు. పార్టీ సిద్ధాంతాలు, ఉద్యమ ఆకాంక్షను ముందుకు తీసుకెళ్లడానికి పార్టీ శ్రేణులకు శిక్షణ ఇస్తున్నారు. టీఆర్ఎస్ శిక్షణ కార్యక్రమాల కన్వీనర్గా పురుషోత్తంరెడ్డిని నియమించి ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. పార్టీ చేపడుతున్న కార్యక్రమాలు, అభివృద్ధి నమూనాను సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేస్తున్నారు. అభివృద్ధి కార్యక్రమాలను ప్రచారం చేసుకుంటూ ప్రతిపక్షాలకు కంటి మీద కునుకులేకుండా చేస్తున్నారు.
టీఆర్ఎస్కు తిరుగులేదు..
సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్రెడ్డి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో జిల్లాలో టీఆర్ఎస్ మరింత బలోపేతమ వుతున్నది. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలో ఎంతో అభివృద్ధి జరిగింది. మంత్రి నిరంజన్రెడ్డి అలుపెరుగకుండా అభివృద్ధి పనులు చేపడుతున్నారు. ఎంత బిజీగా ఉన్నా ప్రజలతో మమేకమవు తున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను స్వయంగా అందజేసి లబ్ధిదారులతో కలిసి భోజనం చేస్తున్నారు. రోడ్లు, మెడికల్, ఇంజినీరింగ్, నర్సింగ్ కళాశాలలు తీసుకొచ్చారు. జిల్లాలో పార్టీ ఎంతో పటిష్టంగా ఉన్నది. ఇతర పార్టీలకు డిపాజిట్ కూడా దక్కదు. ప్రజలందరూ టీఆర్ఎస్ వైపే చూస్తున్నారు.
– గట్టుయాదవ్, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, వనపర్తి