మిడ్జిల్, సెప్టెంబర్ 7 : సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఆసరాతో లబ్ధిదారులకు భ రోసా కలుగుతున్నదని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. మన సంక్షేమ పథకాలు దేశంలోనే ఆదర్శంగా నిలిచాయన్నారు. బుధవారం వాడ్యాల్, బోయిన్పల్లి గ్రా మాల్లో నూతనంగా మంజూరైన ఆసరా పింఛన్ కార్డులను లబ్ధిదారులకు ఎమ్మె ల్యే పంపిణీ చేశారు. అనంతరం మత్స్యకారులతో కలిసి చేప పిల్లలను చెరువు లో వదిలారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 57 ఏండ్లు నిండిన వారికి వృ ద్ధాప్య పింఛన్లు అందజేస్తామని సీఎం కే సీఆర్ వారికి అండగా నిలిచారన్నారు. పింఛన్లతో కుటుంబంలో సంబంధాలు బలపడ్డాయన్నారు. పార్టీలకతీతంగా పింఛన్లు అందిస్తున్నామని చెప్పారు. సొంత జాగా ఉండి ఇల్లు నిర్మించుకునే వారికి దసరా నుంచి ప్రభుత్వం రూ.3 లక్షలు ఆర్థిక సాయం అందిస్తుందన్నారు.
మళ్లీ టీఆర్ఎస్దే గెలుపు..
తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ విజ యం ఖాయమని, తిరిగి సీఎంగా కేసీఆ ర్ అవుతారని బీజేపీ కేంద్రమంత్రి రాం దాస్ అథవాలే వ్యాఖ్యానించారని ఎ మ్యెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. బీజేపీ స ర్కార్ హయాంలో డీజిల్, పెట్రోల్ ధర లు ఆకాశాన్నంటుతున్నాయని ధ్వజమెత్తారు. రైతుల బాగోగులు పట్టించుకోని ప్రధాని మోదీ ఈ మధ్య కాలంలోనే బ డా వ్యాపారులకు రూ.12 లక్షల కోట్ల బ్యాంకు రుణాలను మాఫీ చేశారని తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, జెడ్పీటీసీ శశిరేఖ, ఎంపీపీ కాంతమ్మ, సర్పంచులు రాధికారెడ్డి, మంగమ్మ, నారాయణరెడ్డి, వైస్ ఎంపీపీ తిరుపతమ్మ, ఎంపీటీసీలు సుదర్శన్, గౌ స్, మత్స్యకారుల సంఘం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయాణ, పీఏసీసీఎస్ చై ర్మన్ శ్రీనివాస్రెడ్డి, మార్కెట్ కమిటీ చై ర్మన్ శ్యాంసుందర్రెడ్డి, సర్పంచుల సం ఘం మండలాధ్యక్షుడు జంగిరెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాండు, ము డా డైరెక్టర్ ఎల్లయ్యయాదవ్ పాల్గొన్నారు.