కొల్లాపూర్, సెప్టెంబర్ 15 : పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని శనివారం సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. అనంతరం కొ ల్లాపూర్ పట్టణ శివారులోని బొంగురాళ్ల మిట్ట వద్ద నిర్వహించే భారీ బహిరంగ సభకు హాజరుకానున్నారు. రోడ్డు మార్గం ద్వారా పీఆర్ఎల్ఐ ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ చేరుకుంటారని, ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి ఇంట్లో అల్పాహారం చేసి నేరుగా చేసి సభా వేదిక వద్దకు రా నున్నారు. అయితే ముఖ్యమంత్రి ప్రసంగాన్ని వినేందుకు లక్షలాదిగా ప్రజలు, అభిమాను లు, బీఆర్ఎస్ నాయకులు తరలిరానున్నారు. దీంతో సభకు ఏర్పాట్లు అట్టహాసంగా చేశారు. ఉమ్మడి పాలమూరు జిల్లాతోపాటు వికారాబా ద్, రంగారెడ్డి జిల్లాల నుంచి సుమారు రెండు లక్షల మంది రైతులు, కూలీలు తరలించేందు కు సన్నాహాలు చేస్తున్నారు. 5వేల ప్రైవేటు, ఆ ర్టీసీ వాహనాలను ఏర్పాటు చేశారు.
సుమారు 60 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన సభా వేదిక, ప్రాంగణమంతా వర్షం కురిసిన జనా లు తడవడానికి వీలులేకుండా భారీ షెడ్లను నిర్మించారు. మూడ్రోజులుగా పనులు చకచకా చేపట్టారు. 2 లక్షల మంది ప్రాంగణంలో కుర్చీల్లో కూర్చోవడానికి హైదరాబాద్ నుంచి ప్రత్యేక వాహనాల్లో కుర్చీలు, సామగ్రిని తీసుకొచ్చారు. విద్యుత్ కాంతుల్లో సభా ప్రాంగణం మిరిమిట్లుగొల్పుతున్నది. సీఎం కేసీఆర్ ప్రసంగాన్ని వీక్షించేలా ఎల్ఈడీ స్క్రీన్స్ ఏర్పాటు చేశారు. 1,965 మంది పోలీస్ అధికారులు, కానిస్టేబుళ్లు విధులు నిర్వర్తించనున్నారు. వాహనాల పార్కింగ్ ఏర్పాటు చేశారు. హాజరయ్యే వారికి భోజనం, తాగునీరు, మొబైల్ మరుగుదొడ్లను సిద్ధం చేశారు. పట్టణంలో హోర్డింగ్స్, కటౌట్లు, ఫ్లెక్సీలు, తోరణాలు వెలిశాయి. మంత్రులు నిరంజన్రెడ్డి, శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యేలు బీరం హర్షవర్ధన్రెడ్డి, మర్రి జనార్దన్రెడ్డి, గువ్వల బాలరాజు, జైపాల్ యాదవ్, కలెక్టర్ ఉదయ్కుమార్, ఎస్పీ మనోమర్, అదనపు కలెక్టర్ కుమార్ దీపక్, అధికారులు పర్యవేక్షించారు.
సీఎం కేసీఆర్ పర్యటన షెడ్యూల్
ఏర్పాట్లు పూర్తి చేశాం..
కొల్లాపూర్ రూరల్, సెప్టెంబర్ 15 : పీఆర్ఎల్ఐ ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయినట్లు పీఆర్ఎల్ఐ సీఈ హమీద్ఖాన్ తెలిపారు. శుక్రవారం పీఆర్ఎల్ఐ ప్రాజెక్టులో అన్ని విభాగాలను ఎస్ఈ సత్యనారాయణరెడ్డి, ఈఈ శ్రీనివాస్రెడ్డితో కలిసి తనిఖీ చేశారు. కంట్రోల్ రూం, డెలివరీ సిస్టర్న్ వద్ద ఏర్పాట్లు చేశామన్నారు. రెండు రోజులుగా సర్జ్పూల్ను దశల వారీగా నింపుతున్నట్లు తెలిపారు. సీఈ వెంట డీఈలు శ్రీనివాస్, ప్రవీణ్ తదితరులున్నారు.