అమ్రాబాద్, మార్చి 2 : మహాశివరాత్రి సందర్భంగా అమ్రాబాద్ మండలంలో నిర్వహించనున్న భౌరాపూర్ జాతరను విజయవంతం చేయాలని అదనపు కలెక్టర్ కుమార్దీపక్ అన్నారు. శనివారం మండలంలోని మన్ననూర్ చింకారహాల్లో జాతర ఏర్పాట్లపై చెంచు పెద్దలు, భౌరాపూర్ పూజారుల తో ఐటీడీఏ పీవో, డీఎఫ్వో రోహిత్ గోపిడి ఆధ్వర్యంలో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా కు మార్దీపక్ మాట్లాడుతూ చెంచు పెద్దల సలహాలు, సూచనల మేరకు రవాణా సౌకర్యం, భోజన వసతులు, సాంస్కృతిక కార్యక్రమాలు, జాతరలో తే రు, శాంతిపూజ తదితర ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అడవిగుండా భౌరాపూర్ చేరుకొని భ క్తులు వన్యప్రాణులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ చెంచుల జాతరను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో డీటీడీవో కమలాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.