కోయిలకొండ, నవంబర్ 24 : కార్తీకమాసం ముగింపు సందర్భంగా గురువారం మండలంలోని శేరివెంకటాపూర్లో ఆంజనేయస్వామి జల్ది ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సమీపంలోని వాగులో గంగామాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ఆలయం వరకు జల్దిబిందె, ఆంజనేయస్వామి ఊరేగింపు నిర్వహించారు. నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి, సోదరుడు ఎస్.రవీందర్రెడ్డి ఆధ్వర్యంలో ఆంజనేయస్వామికి అభిషేకం, అర్చన పూజలు చేశారు. ఉత్సవంలో పాల్గొన్న భక్తులకు అన్నదా న కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమంలో జెడ్పీటీసీ విజయభాస్కర్రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బి.కృష్ణయ్య, సింగిల్విండో చైర్మన్ శ్రీనివాస్రెడ్డి, వైస్ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, రైతుబంధు సమితి మండల కన్వీనర్ మల్లయ్య, సర్పంచులు సుందరమ్మ, రాము, నారాయణరెడ్డి, కరుణాకర్రెడ్డి, మమతారెడ్డి, గోపాల్, నారాయణయాదవ్, ఆంజనేయులు, నాయకులు భీంరెడ్డి, శ్రీనివాస్రెడ్డి, గిరిధారి నాగయ్య, మోహన్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు.