ఇటిక్యాల, డిసెంబర్ 19 : బీచుపల్లి క్షేత్రం లోని కృష్ణా నదిలో పురా తన విగ్రహాలను మంగళవారం కేంద్రీయ, రాష్ట్ర పురావస్తు శాఖ అధికారులు సంయుక్తంగా గుర్తించారు. కొన్ని రోజులుగా బీచుపల్లి తాగునీటి పథకం ఇన్టేక్ వెల్ వద్ద కృష్ణా నదిలో పేరుకుపోయినరాతి విగ్రహాలను గుర్తించారు. ఈ సందర్భంగా నదిలో ఎక్కడి నుంచో గత కొన్ని రోజులుగా విగ్రహాలను పారవేయడం వల్ల అవి ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయమై వారు స్థానిక జాలర్లు, సమీప గ్రామ ప్రజలతో విచా రణ చేపట్టారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎక్కడైనా విగ్రహాలకు చిన్న డామేజ్ జరిగినా ప్రతిష్ఠించకుండా నదిలో పార వే యడం, అలాగే ఏదైనా ఆలయం శిథిలా వస్థకు గురైనా నూతన ఆలయ నిర్మాణం చేపటాల్టనుకున్నప్పుడు పాత విగ్రహా ల ను తొలగించి కొత్త విగ్ర హా లను ప్రతిష్ఠించడం ఆనవాయితీ అన్నారు. అయితే నదిలో దాదాపు చిన్నవి, పెద్దవి మొత్తం400 వరకు విగ్ర హా లను గుర్తించి వాటిని ఒడ్డుకు చేర్చినట్లు చెప్పారు. అయితే జిల్లా అధి కా రులు ఆదే శాల మేరకు వాటి కి ఎక్క డికి తర లిం చాలో త్వరలో వెలడ్లిస్తామని చెప్పారు.