నారాయణపేటరూరల్, నవంబర్ 1 : కాంగ్రెస్ నమ్మి ఓట్లు వేస్తే వ్యవసాయానికి కరెంట్లేక రైతులు ఆగం అవుతారని నారాయణపేట ఎమ్మెల్యే ఎస్.రాజేందర్రెడ్డి హెచ్చరించారు. మండలంలోని శేర్నపల్లి, సింగారం, శాసన్పల్లి, లింగంపల్లి, పిల్లిగుండ్లతండా, పాతతండాల్లో బుధవారం ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకులు మోసపూరిత హామీలు ఇవ్వడంతోపాటు ఆరు గ్యారెంటీల పేరిట ఓట్లు రాబట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నదని మండిపడ్డారు. కర్ణాటకలో మాయమాటలతో అధికారంలోకి వచ్చి నేడు ప్రజలను నానా రకాలుగా ఇబ్బందుల పాలుచేస్తున్నదన్నారు. సాధ్యం కాని హామీలను ఇచ్చి వాటిని అమలుచేయలేక చేతులెత్తేసిందన్నారు. రైతులకు మూడు గంటల కరెంట్ మాత్రమే చాలని టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి చెబుతున్నారని.. అలాంటి వారిని నమ్మి మోసపోవద్దని కోరారు. తమ ప్ర భుత్వం చేసే వాటిని హామీలుగా ప్రకటిస్తుందని, ఈ విషయం ప్రజలందరికీ తెలుసన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కింద సాగునీరందించి రైతుల పాదాలు క డుతానన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ శ్రీనివాస్రెడ్డి, జెడ్పీటీసీ అంజలి, పీఏసీసీఎస్ చైర్మన్ నర్సింహారెడ్డి, జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు తాజుద్దీన్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ లక్ష్మీకాంత్, రైతుబంధు సమితి సభ్యుడు జగన్మోహన్రెడ్డి, మైనార్టీ సంఘం మండలాధ్యక్షుడు అలీశేర్, సర్పంచుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు సాయిరెడ్డి పాల్గొన్నారు.
నారాయణపేట, నవంబర్ 1 : గెలుపే ధ్యేయంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పిలుపునిచ్చారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ధన్వాడ మండలంలోని కాంగ్రెస్, బీజేపీకి చెందిన నీరటిబాబా, బాలకృష్ణ, లక్ష్మయ్య, పాపన్న, లక్ష్మన్న, బాలప్ప, సుధాకర్, పవన్ తదితరులు ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చే రారు. అలాగే జిల్లా కేంద్రంలోని 19వ వార్డు కుర్వగేరిలో బీజేపీకి చెందిన 50 మంది యువకులు గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ అమరేందర్రెడ్డి, బీఆర్ఎస్ ధన్వాడ ఇన్చార్జి రాజవర్ధన్రెడ్డి, నర్సింహులు, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొండారెడ్డి, నాయకులు చంద్రకాంత్, ఫిరోజ్ పాల్గొన్నారు.