పాలమూరు, డిసెంబర్ 8: ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృం దం తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ యాప్ ను ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకుని ప్రతినెలా విద్యార్థుల ఉన్నతికి సంబంధించిని ప్రగతిని అఫ్లోడ్ చేయాలని సమగ్ర శిక్ష సెక్టోరియల్ అకాడమిక్ మానిటరింగ్ అధికారి, ఏఎంవో శ్రీనివాస్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బోయపల్లి జెడ్పీహెచ్ఎస్లో ప్రధానోపాధ్యాయురాలు కవిత అధ్యక్షతన మహబూబ్నగర్ అర్బన్, రూరల్ మండలాల సాంఘిక శాస్త్ర ఉన్నత పాఠశాలల కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఏఎంవో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిఒక్క ఉపాధ్యాయుడు వారి పాఠశాలలో జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాల సమాచారాన్ని అందించాలన్నారు. జిల్లాలో బెస్ట్ ప్రాక్టీస్ స్కూల్ను గుర్తించి వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలను కూడా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో స్టేట్ రిసోర్స్ పర్సన్ రతన్ పాండురంగ, సాంఘికశాస్త్ర ఫోరం అధ్యక్షుడు చెన్న య్య, రిసోర్స్ పర్సన్లు లింగస్వామి, సీఆర్పీ శ్రీనివాసులు, ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, డిసెంబర్ 8: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని సాధించేలా విద్యను అందించాలని మహబూబ్నగర్ డీఈవో రవీందర్ అన్నారు. బాదేపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన స్కూల్ కాంప్లెక్స్ సమావేశాన్ని డీఈవో రవీందర్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉపాధ్యాయులు విలువలతో కూడిన విద్యను అందించాలన్నారు. సామర్థ్యాల వారీగా బోధనలు చేయాలన్నారు. విద్యార్థుల సామర్థ్యాలను ఎప్పటికప్పుడూ పరిశీలిస్తూ వారికి విద్యాబోధన చేయాలన్నారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు తరగతి గదుల్లో తీసుకోవాల్సిన చర్యలను వివరించారు. కార్యక్రమంలో ఎంఈవో మంజుల, హెచ్ఎంలు చంద్రకళ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
దేవరకద్ర, డిసెంబర్ 8: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులో అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలని ఎఫ్ఎల్ఎన్ నోడల్ అధికారి బలరాం సూచించారు. శుక్రవారం మండలంలోని లక్ష్మీపల్లి, బస్వాయిపల్లి, చౌదర్పల్లి, హజిల్లాపూర్లోని ప్రభుత్వ పాఠశాలలను ఎఫ్ఎల్ఎన్ నోడల్ అధికారి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా పాఠశాలల్లో ఎఫ్ఎల్ఎన్ అమలుకు సంబంధించి నిర్వహిస్తున్న రికార్డులు, ఉపాధ్యాయుల తరగతిగది బోధనను పరిశీలించారు. అదేవిధగా ఆయా పాఠశాలల్లో ఉపాధ్యాయులతో ప్రత్యేక సమావేశని నిర్వహించి మాట్లాడారు. కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.