నవాబ్పేట, మే 9 : మండలంలోని అమ్మాపూర్ గ్రామం అభివృద్ధ్ది పథంలో ముందుకు సాగుతోంది. అభివృద్ధ్దికి ఆమడదూరంలో ఉండే అమ్మాపూర్ గ్రామం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత గ్రామంలో అభివృద్ధ్దికి అడుగులు పడ్డాయి. ఒకప్పుడు గ్రామంలో మురుగుకాల్వల దుర్గంధం, చెత్తాచెదారం, గంతుకులతో దర్శనమిచ్చె రోడ్లు, వీధులు ప్రస్తుతం తళుక్కుమంటున్నాయి. తెలంగాణ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కోసం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పల్లెప్రగతి, హరితహారం కార్యక్రమాలకు గ్రామసర్పంచ్ అంకూరి సత్యం, ఉపసర్పంచ్ శ్రీకాంత్రెడ్డి, గ్రామస్తుల కృషి తోడవ్వడంతో గ్రామంలో అభివృద్ధ్ది పనులు చకచకా జరిగిపోయాయి. అదేవిధంగా ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ప్రత్యేక చొరవతో నిధులు మంజూరు చేయడం వల్ల గ్రామాన్ని అన్నిహంగులతో అభివృద్ధి చేస్తున్నారు. వివరాలలోకి వెళ్తే మండలంలోని అమ్మాపూర్ గ్రామంలో గతంలో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో అంకూరి సత్యం సర్పంచ్గా ఎన్నికయ్యాడు.
అనంతరం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతిలో భాగంగా గ్రామంలో ముమ్మరంగా పారిశుధ్య పనులు చేపట్టారు. హరితహారంలో భాగంగా మొక్కలునాటి సంరక్షిస్తున్నారు. అలాగే నర్సరీ, పల్లెప్రకృతివనం, సెగ్రిగేషన్ షెడ్ నిర్మాణం పనులను పూర్తి చేశారు. గతంలోనే గ్రామంలోనే గ్రామస్తులు 195 మరుగుదొడ్లు, 190 ఇంకుడు గుంతల ను నిర్మించుకున్నారు. గ్రామసర్పంచ్ సత్యం చొరవంతో గ్రామం నుంచి వివిధ పంటపొలాలకు వెళ్లేందుకు సుమారుగా ఎనిమిది మట్టి రోడ్లు వేశారు. వానకాలంలో కాలినడకకే ఇబ్బందిగా ఉండే గ్రామంలో రూ.30 లక్షలతో సుమారుగా 10 సీసీ రోడ్లు నిర్మించి గ్రామంలో మట్టిరోడ్లు లేకండా తీర్చిదిద్దడం జరిగింది. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ నల్లాల తాగునీటిని అందించారు. గ్రామంలో నూతనంగా 115 కరెంట్ పోల్స్ ఏర్పాటు చేయించి విద్యుత్ సమస్య లేకుండా చేశారు. ఎంపీ, ఎమ్మెల్యే చొరవతో అమ్మాపూర్ నుంచి పోమాల లింక్రోడ్డు వరకు మట్టి రోడ్డును బీటీగా మార్చేందుకు నిధులు మంజూరు చేయడం చేశారు. అలాగే గ్రామంలో ఎస్సీ, బీసీ కమ్యూనిటీ హాళ్లు నిర్మించేందుకు రూ.10లక్షలు మం జూరయ్యాయి. ఎంపీ నిధులతో అమ్మాపూర్ గేట్నుంచి గ్రామంలోకి హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నారు.
అందరి సహకారంతోనే అభివృద్ధి
ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డి, ఎమ్మె ల్యే లక్ష్మారెడ్డి, గ్రామంలోని అన్ని వర్గాల సహకారంతోనే గ్రామాన్ని అన్ని విధాలుగా అబివృద్ధ్ది చేసుకుంటున్నాం. గతంలో అమ్మాపూర్ గ్రామంలో అనేక సమస్యలుండేవి. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభు త్వం ప్రవేశపెట్టిన పల్లెప్రగతి కార్యక్రమంతో మాగ్రామం రూపురేఖలు మారిపోయాయి. గ్రామాభివృద్ధికి ఎంతో శ్రమించాం. అమ్మాపూర్ గేట్ నుంచి పోమాల రోడ్డు వరకు బీటీ రోడ్డు మంజూరైంది. త్వరలోనే బీటీ రోడ్డు నిర్మాణం పనులు ప్రారంభిస్తాం. అలాగే హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేస్తాం. గ్రామంలో ఇప్పటి వరకు ఎంతో చేశాం. ఇంకా చేయాల్సిన పనులు అనేకం ఉన్నాయి. గ్రామస్తులంతా సహకరించాలి.
– అంకూరి సత్యం, సర్పంచ్ అమ్మాపూర్
గ్రామంలో చాలా మార్పు వచ్చింది
గ్రామంలో గతంలో అనేక సమస్యలు ఉండేవి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గ్రామంలో అనేక సమస్యలు తొలగిపోయాయి. ఎన్నో అభివృద్ధి పనులు చేపట్టాం. గ్రామం నుంచి బయటకు వెళ్లాలంటే రోడ్లన్నీ బురదమయంగా ఉండేవి. కాలినడకకు కూడా ఇబ్బందులు ఏర్పడేవి. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేకుండా రోడ్లన్నీ మెరుగుపర్చాం. – శ్రీకాంత్రెడ్డి, ఉపసర్పంచ్, అమ్మాపూర్
అన్ని వార్డుల్లో అభివృద్ధి పనులు
అమ్మాపూర్లోని అన్ని వార్డుల్లో అభివృద్ధ్ది పనులు చేపట్టడం జరిగింది. గతంలో అమ్మాపూర్ దళితవాడలో నడిచి వెళ్లాలంటేనే ఇబ్బందిపడే పరిస్థితులు ఉండేవి. ఇప్పుడు సీసీ రోడ్ల ఏర్పాటుతో కాలనీ మొత్తం సర్వాంగసుందరంగా తయారైంది. గ్రామానికి నిధులు మంజూరు చేసిన ఎంపీ మన్నె శ్రీనివాస్రెడ్డికి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. – యాదయ్య, గ్రామ యువకుడు