ఇటిక్యాల, డిసెంబర్ 12 : కార్తీకమాసం ముగింపు సందర్భంగా మంగళవారం బీచుపల్లి క్షేత్రవలో స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అర్చకులు మారుతాచారి, సందీపాచారి స్వామివారికి పంచామృతాభిషేకం, ఆకుపూజ, తీర్థప్రసాదాల నివేదన, మహామంగళహారతి కార్యక్రమాలను నిర్వహించారు. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అంజన్నను దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు అన్నదాన కార్యక్రమం చేపట్టారు. కార్యక్రమాలను ఆలయ కార్యనిర్వహణాధికారి రామన్గౌడ్ పర్యవేక్షించారు.