కొత్తకోట, ఏప్రిల్ 20 : రైతును రాజు చేయడమే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యమని దేవరకద్ర ఎమ్మె ల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. కొత్తకోట మం డలం పాలెంలో గురువారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మా ట్లాడుతూ ప్రభుత్వం రైతులకు సాగునీటి వసతి కల్పించడం, అనేక పథకాలను అమలు చేస్తుండడంతో పంటసాగు విస్తీర్ణం పెరిగిందన్నారు. పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు రైతులు ఇబ్బందులు పడొద్దని ప్రభుత్వమే ఊరూరా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి మద్దతు ధర కల్పిస్తున్నదని తెలిపారు. కొనుగోలు కేంద్రాలను సద్వినియో గం చేసుకోవాలని రైతులకు సూచించారు. అనంతరం ఇటీవల హత్యకు గురైన భారతి తల్లిదండ్రులు లక్ష్మణ్, పద్మను పరామర్శించారు.
అలాగే ఇటీవల చిన్నారి వర్షిణి మృతి చెందగా, తల్లిదండ్రులను పరామర్శించి రూ.10వేల ఆర్థికసాయం అందజేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్చైర్మన్ వామన్గౌ డ్, మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని, ఎంపీపీ గుంత మౌనిక, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, డీసీసీబీ డైరెక్టర్ వంశీధర్రెడ్డి, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మ డి జిల్లా అధికారప్రతినిధి ప్రశాంత్, కొండారెడ్డి, భీంరెడ్డి, బాలకృష్ణ, బాబురెడ్డి, మోహన్కుమార్, రామకృష్ణారెడ్డి, రాజు, అలీం, మైబు, వెంకటేశ్వర్రెడ్డి, అయ్యన్న, బాలకృష్ణారెడ్డి, భాస్కర్, రాములుయాదవ్ తదితరులు పాల్గొన్నారు.
పేదల బతుకుల్లో వెలుగులు
దేవరకద్ర, ఏప్రిల్ 20 : ప్రభుత్వం అమలుచేస్తున్న పథకాలు పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్నాయని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నా రు. మండలంలోని లక్ష్మీపల్లిలో గురువారం 160 మందికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణారెడ్డి, ఎంపీపీ రమాశ్రీకాంత్యాదవ్, తాసిల్దార్ జ్యోతి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజయావెంకటేశ్, సహకా ర సంఘం అధ్యక్షుడు డోకూర్ నరేందర్రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు నర్సింహారెడ్డి ఉన్నారు.