ఉమ్మడి పాలమూరు జిల్లా పచ్చలహారాన్ని సింగారించుకోనున్నది. ఐదు జిల్లాలు పచ్చందాలతో పరిఢవిల్లనున్నాయి. పచ్చని మొక్కలతో హరిత తోరణాలు చిగురించనున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం 9వ విడుతకు సర్వం సిద్ధమైంది. ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాన్ని చేరుకునేలా అధికారులు సమాయత్తమవుతున్నారు. ఖాళీ జాగాలు, రోడ్లకిరువైపులా, ప్రభుత్వ కార్యాలయాల ఆవరణలు, చెరువులు, రిజర్వాయర్ల గట్లు, ఇంటి పెరట్లో ప్లాంటేషన్కు ఏర్పాట్లు చేస్తున్నారు. నర్సరీల్లో ఇప్పటికే మొక్కలు అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో గుంతలు తీసి సిద్ధం చేయాలని ఆయా జిల్లాల్లో సమావేశాలు నిర్వహించి కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. నాటిన ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్ చేపట్టాలని సూచించారు.
– మహబూబ్నగర్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్, జూలై 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం విజయవంతానికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు, సామాజిక వేత్తలు సమాయాత్తమవుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో ఉమ్మడి జిల్లాలో 9వ విడుత హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇప్పటికే గ్రామాలు, మండలాలు, మున్సిపాలిటీల్లోని నర్సరీల్లో ఆయా జిల్లాలకు కావాల్సినన్ని మొక్కలను పెంచి అందుబాటులో ఉంచారు. అటవీశాఖ ద్వారా ప్రత్యేకంగా మొక్కలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాల వారీగా చేపట్టిన లక్ష్యాలను అడిగి తెలుసుకొని హరితహారం కార్యక్రమం కోసం ఆయా జిల్లాల్లో చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఆయా జిల్లా కలెక్టర్లు వివిధ శాఖల అధికారులు, తాసీల్దార్లు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్షా సమావేశాలు నిర్వహించి ఆయా శాఖలకు టార్గెట్లను ఇచ్చారు.
వర్షాలు ప్రారంభమైనందునా జిల్లాల్లో గుంతలు తవ్వే కార్యక్రమాన్ని 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశాలు ఇచ్చారు. గుంతలు తవ్వకం పూర్తయ్యాక మొక్కలను నాటేందుకు చర్యలు చేపట్టాలని ప్రతి మొక్కకు జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. పచ్చని చెట్లతో ఆహ్లదకర వాతావరణం కలిగించేలా మొక్కలను నాటాలని జిల్లా అధికారులకు కలెక్టర్లు సూచించారు. రహదారులకు ఇరువైపులా రెండు, మూడు వరసల్లో అవెన్యూ ప్లాంటేషన్ మొక్కలు నాటాలన్నారు. మొక్కలు కనిపించేలా వాటికి రక్షణ కంచె ఏర్పాటు చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంతో ఉమ్మడి జిల్లా పచ్చదనంతో నిండిపోయింది. కేసీఆర్ అర్బన్ ఏకో పార్కుకు రాష్ట్ర స్థాయిలో గుర్తింపు వచ్చింది. 44వ జాతీయ రహదారిపై ఇరువైపులా నాటిన మొక్కలతో కళకళలాడుతున్నది.
జిల్లా కేంద్రాలు, పట్టణాలు, గ్రామాల్లో విరివిగా మొక్కలు నాటడం వాటిని సంరక్షించడం వల్ల జిల్లాల్లో ఎక్కడ చూసినా పచ్చదనంతో కళకళలాడుతున్నది. ప్రాజెక్టులు పూర్తికావడం, చెరువుల్లో సమృద్ధిగా నీళ్లు చేరడం, రిజర్వాయర్లు నిండుకుండల్లా ఉండటంతో ఎక్కడ చూసినా పచ్చని చెట్లే దర్శనమిస్తున్నాయి. జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసిన విద్యాలయాలు, కలెక్టరేట్లు, ఇతర చోట్ల కూడా పచ్చదనం పరుచుకున్నది. ఫలితంగా పాలమూరు జిల్లా పచ్చని తోరణంలా కనిపిస్తున్నది. 2021లో రెండు కోట్ల విత్తన బంతులను ఏకకాలంలో వెదజల్లి గిన్నిస్ వరల్డ్ రికార్డును సాధించారు. ఈఏడాది కూడా అదే లక్ష్యంతో మహబూబ్నగర్, నాగర్కర్నూల్, గద్వాల, నారాయణపేట, వనపర్తి జిల్లాల్లో మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాలో పదిశాతం వరకు మొక్కలు నాటే కార్యక్రమం పూర్తి కాగా.. మహబూబ్నగర్ జిల్లాలో 15 శాతం దాకా పూర్తి చేశారు.
అందుబాటులో మొక్కలు..
తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో అన్ని శాఖలకు టార్గెట్లు ఇచ్చి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కార్యక్రమాన్ని మొక్కుబడిగా కాకుండా ఓ యజ్ఞంలా చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. హరితహారం కార్యక్రమానికి కావాల్సిన మొక్కలను ప్రభుత్వం ఆయా శాఖల ద్వారా ముందుగానే గ్రామ, మండల నర్సరీల్లో పెంపకాన్ని చేపట్టారు. జిల్లాల్లో ఏ మొక్కలు అనువుగా పెరుగుతాయో వాటిని ముందుగానే అంచనా వేసి అలాంటి మొక్కలనే పెంచి సిద్ధ్దంగా ఉంచారు. ప్రతి గ్రామాపంచాయతికీ ఒక నర్సరీలో భాగంగా ఒక్క మహబూబ్నగర్ జిల్లాలో 441 నర్సరీలు, అటవీశాఖ ద్వారా పెద్ద పెద్ద మొక్కలు పెంచడానికి మండలానికి ఒకటి చొప్పున 16నర్సరీలు ఏర్పాటు చేశారు. జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో 19 నర్సరీలను ఏర్పాటు చేసి మొత్తం 476 నర్సరీల్లో జిల్లాకు కావాల్సిన అన్ని రకాల మొక్కలను సిద్ధ్దంగా ఉంచారు. 2014 నుంచి గత ఏడాది వరకు ఒక్క మహబూబ్నగర్ జిల్లాల్లోనే 182 కిలోమీటర్ల పొడవునా రూ.260 కోట్లతో రహదారుల వెంట 88,473 మొక్కలను నాటారు. ఈఏడాది లక్ష్యానికి మించి మొక్కలు నాటాలని జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది.
జిల్లాల్లో హరితహారం టార్గెట్..
హరితహారం కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లాకు టార్గెట్ ఇచ్చి ఆమేరకు మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో 55 లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. పర్తి జిల్లాలో 21లక్షలు, నాగర్కర్నూల్ జిల్లాలో 45 లక్షలు, నారాయణపేట జిల్లాలో 23 లక్షలు, గద్వాల జిల్లాలో 14లక్షల మొక్కలు నాటేందుకు లక్ష్యంగా పెట్టుకున్నారు. మహబూబ్నగర్ జిల్లాలో ఇప్పటి వరకు పదహైదు శాతం వరకుపూర్తయింది. ఇప్పటివరకు ఆయా జిల్లాల్లో నిర్దేశించిన చోట్ల గుంతలను తవ్వే కార్యక్రమం చేపట్టారు. గుంతల తవ్వకం దగ్గర నుంచి మొక్కలు సంరక్షించే బాధ్యత కూడా ఆయా శాఖలకు అప్పగించారు. రహదారులకు ఇరువైపులా నాటడం, కొత్తగా నిర్మిస్తున్న జాతీయ రహదారుల పక్కన చెరువు గట్లపై, ట్యాంకుబండ్లపై, రిజర్వాయర్ల గట్లపై కూడా నాటేందుకు సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఆయా జిల్లాల్లో సంపద వనాలపై దృష్టి సారించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు.
ప్రతి మొక్కకూ జియో ట్యాగింగ్..
హరితహరం కింద నాటిన ప్రతిమొక్కకు జియో ట్యాగింగ్ చేస్తున్నారు. మొక్కలు నాటే స్థలాలను గుర్తించి గుంతలు తవ్వడం వివిధ రకాల మొక్కలు నాటడం వాటిని సంరక్షించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రహదారులు, ప్రభుత్వ ఖాళీ జాగల్లో, కొండలు, కొనల్లో కూడా మొక్కలు నాటేందుకు ప్లాన్ చేస్తున్నారు. గ్రామ పంచాయతీల్లో, మున్సిపాలిటీల్లో కూడా ఇండ్ల పెరట్లలో పండ్ల మొక్కలను ఇతరాత్ర మొక్కలను పంపిణీ చేస్తున్నారు. దీనివల్ల ఖాళీ జాగా అనేదే లేకుండా మొక్క లతో నింపేయాలన్నది లక్ష్యంగా పెట్టుకున్నారు. గత ఏడాది భూత్పూర్ మున్సిపాలిటీకి రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పరిశుభ్రతపై అవార్డు కూడా వచ్చింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కింద గ్రామాల్లో, పట్టణాల్లో విరివిగా మొక్కలను నాటడంవల్ల చాలా చోట్ల పెరిగిన చెట్లు దర్శనమిస్తున్నాయి. ప్రజల్లో కూడా హరితహారం కింద మొక్కలు నాటించేందుకు చైతన్యం తీసుకురావడంతో పాలమూరు పచ్చద నంతో కళకళలాడుతున్నది.
పరిశీలన అనంతరం ఎంపికగతంలో అనాథలకు కేవలం ఆర్థిక సాయం మాత్రమే అం దించేవారు. కానీ తెలంగాణ రా ష్ట్రం ఏర్పడ్డాక మిషన్ వాత్సల్య పథకం పేరుతో ప్రతినెలా ఇచ్చే ఆర్థిక సాయంతోపాటు విద్య, వైద్యానికి పెద్దపీట వేసింది. జిల్లా వ్యాప్తం గా దాదాపు 600 దరఖాస్తులు అందగా వాటిని ఉన్నతాధికారులకు నివేదించాం. వాటిని క్షేత్ర స్థాయిలో పూర్తిగా పరిశీలించిన తర్వాత అర్హులను ఎంపిక చేస్తాం. నాగర్కర్నూల్ జిల్లాలో ప్ర స్తుతం 54 మంది బాలబాలికలు లబ్ధి పొం దుతున్నారు. జిల్లాలో ఇంకా ఎవరైనా మిగి లి ఉంటే వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు.
– వెంకటలక్ష్మి , స్త్రీ, శిశు సంక్షేమ శాఖ జిల్లా అధికారిణి