పెబ్బేరు, జూలై 11 : తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టులన్నీ నీరులేక వెలవెలబోతున్నాయి. జూలై నెల సగం పూర్తవుతున్నా ఇంకా వరుణుడు కరుణించడం లేదు. గతేడాది ముందుగానే వర్షాలు కురిసి జలకళ నెలకొన్నది. జూరాల ప్రాజెక్టు గేట్లు జూలైలోనే ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు.
విడుదలైన నీరంతా బీచుపల్లి మీదుగా శ్రీశైలం జలాశయానికి తరలివెళ్లింది. కానీ ఈసారి ఇప్పటి వరకు వర్షాల జాడ ఇంకా కనిపించకపోవడంతో బీచుపల్లి-రంగాపురం మధ్య కృష్ణానది నీళ్లులేక వట్టిబోయి రాళ్లు రప్పలు తేలి వెలవెలబోతోంది. ఎల్నినో ప్రభావానికి ఇది దర్పణంగా నిలుస్తోంది.