భూత్పూర్, జనవరి 10 : అర్హులందరూ కొవిడ్ బూస్టర్డోస్ వేయించుకోవాలని సీహెచ్వో రామయ్య అన్నారు. సోమవారం మున్సిపాలిటీలోని ఆరోగ్య ఉపకేంద్రంలో బూస్టర్డోస్ వ్యాక్సినేషన్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కరోనా నియంత్రణకు అర్హులైన ప్రతిఒక్కరూ వ్యాక్సిన్ వేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సత్తూర్ నారాయణగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు నర్సింహాగౌడ్, మురుళీధర్గౌడ్, ఏఎన్ఎం వెంకటనర్సమ్మ తదితరులు పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
ఫ్రంట్లైన్ వర్కర్లు బూస్టర్ డోస్ వేసుకోవాలని తాసిల్దార్ రాజేందర్రెడ్డి సూచించారు. మండలకేంద్రంలోని ప్రభుత్వ దవాఖానలో బూ స్టర్డోస్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించి వ్యా క్సిన్ వేయించుకున్నారు. కార్యక్రమంలో వైద్యాధికారి హ రినాథ్, సిబ్బంది రాఘవేందర్, అవినాష్ పాల్గొన్నారు.