గద్వాల, నవంబర్ 28 : కులాలు, మతాల మధ్య చిచ్చుపెడుతున్న బీజేపీ.. రా ష్ట్రంలో అధికారంలోకి వస్తామని పగటి కలలు కంటున్నదని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి తెలిపారు. సోమవారం కేటీదొడ్డి మండలానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు కురువవిష్ణు, ఎస్సీ సెల్ మండలాధ్యక్షుడు వీరేశ్, వార్డు మెంబర్ నర్సింహులుతోపాటు మరో 20 మంది నాయకులు టీఆర్ఎస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే తన క్యాంప్ కార్యాలయంలో పార్టీ కండువాలు కప్పారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పార్టీలకతీతంగా ప్రతి ఇంటికీ సంక్షేమ పథకాలు అందజేస్తున్న నాయకుడు సీఎం కేసీఆర్ మాత్రమే అని అన్నారు. త్వరలో భారీ స్థాయిలో బీజేపీ నుంచి టీఆర్ఎస్లోకి చేరికలు ఉంటాయన్నారు. పార్టీ కార్యకర్తలను, కొత్తగా చేరుతున్న వారిని గుండెల్లో పెట్టుకుంటామన్నారు. పార్టీలో చేరిన వారిలో ఆంజనేయులు, వీరన్న, నర్సింహులు, రమేశ్, ప్రతాప్, మల్దకల్, జనార్దన్, ఉలిగప్ప, దుబ్బన్న తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో రైతుబంధు సమితి మండలాధ్యక్షుడు హనుమంతు, నాయకులు ఉరుకుందు, చక్రధర్రావు, యుగేందర్గౌడ్, వెంకటేశ్, చంద్రశేఖర్, శ్రీను పాల్గొన్నారు.