]అయిజ, జనవరి 3 : నియోజకవర్గంలోని అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అధికారులను ఆదేశించా రు. బుధవారం మున్సిపాలిటీ పరిధిలోని పర్ధిపురం గ్రామంలో జరిగిన ప్రజాపాలనలో అభయహస్తం దరఖాస్తులను ఎమ్మెల్యే స్వీకరించారు. ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుకు దరఖాస్తులు స్వీకరిస్తుందని, అ ర్హులైన పేదలు దరఖాస్తులు అందించాలని కోరారు. ప్ర జా సమస్యల పరిష్కారానికి ఎల్లవేళలా అందుబాటు లో ఉంటూ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సందర్భంగా భగత్సింగ్ యూత్ సభ్యు లు పర్ధిపురంను గ్రామ పంచాయతీగా గుర్తించేందుకు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యేకు వినతిపత్రం అంద జేశారు. అలాగే మండలంలోని పులికల్లో నిర్వహించిన ప్రజాపాలనలో ఎంపీడీవో సాయిప్రకాశ్ దరఖాస్తులను స్వీకరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దేవన్న, కమిషనర్ నిత్యానంద్, సర్పంచ్ గోవర్ధనమ్మ, ఎంపీవో నర్సింహారెడ్డి, కౌన్సిలర్లు, అధికారు లు, నాయకులు పాల్గొన్నారు.
మానవపాడు, జనవరి 3 : అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని ఎమ్మెల్యే విజయుడు అన్నారు. బుధవారం మానవపాడులో నిర్వహించిన ప్రజాపాలన కార్యక్రమాన్ని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా దరఖాస్తు చేసుకోవడానికి వ చ్చిన ప్రజలకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీశారు. దరఖాస్తులు సరిపోయినన్ని ఉన్నాయా లేదా అని ఎం పీడీవోను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తులు సమర్పించేందుకు ప్రజలు భారీగా రావడంతో ఎమ్మెల్యే విజయుడు అందరి దరఖాస్తులు స్వీకరిస్తారని సంయమనం పాటించాలన్నారు. కొత్త రేషన్కార్డు కోసం తెల్ల పేపర్ మీద రాసి దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కాగా మానవపాడులో 1,338, చెన్నిపాడులో 254 దరఖాస్తులు స్వీకరించినట్లు జెడ్పీ సీఈవో, మం డల ప్రత్యేకాధికారి నాగేంద్రం తెలిపారు.