అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిన అలంపూర్ గడ్డ.. తెలంగాణలో ప్రగతికి అడ్డాగా మారింది. రూ.786 కోట్లతో తుంగభద్ర నదీ తీరంలో రాజోళి మండలం తుమ్మిళ్ల వద్ద ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. ఇప్పటికే 25 వేల ఎకరాలకు సాగునీరు అందగా.. 55 వేల ఎకరాలకు పెంచేలా, రూ.13.50కోట్లతో ఆర్డీఎస్ కాల్వ పూడికతీత పనులు జరుగుతున్నాయి. ఇరిగేషన్ కోసం రూ.384 కోట్లను ప్రభుత్వం కేటాయించింది. అలాగే అలంపూర్ చౌరస్తాలో రూ.21 కోట్లతో వంద పడకల, అయిజలో రూ.80 లక్షలతో 30 పడకల దవాఖానను ఆధునీకరించారు. డయాలసిస్ కేంద్రానికి రూ.60 లక్షలు, 18 హెల్త్ సబ్సెంటర్ల ఏర్పాటుకు 3.60కోట్లు కేటాయించారు. అలంపూర్, వడ్డేపల్లి, అయిజ మున్సిపాలిటీలకు రూ.10 కోట్ల చొప్పున మంజూరు చేయగా సెంట్రల్, డివైడర్ కం లైటింగ్, డ్రైనేజీ, సీసీ చేపట్టారు. పల్లెప్రగతితో మాన్దొడ్డి పంచాయతీ జాతీయ స్థాయిలో మెరిసి అవార్డు అందుకున్నది. ఇన్ని మంచి పనులు చేసిన సీఎం కేసీఆర్ ఆదివారం అలంపూర్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభలో జనం నీరాజనం పలికేందుకు ఎదురుచూస్తున్నారు.
అలంపూర్, నవంబర్ 17: 60ఏండ్ల నుంచి జరగని అభివృద్ధి పనులను తెలంగా ణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ చేసి చూపించారు. ఏపీ, తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన అలంపూర్ నియోజకవర్గంలో రైతులు ఎదుర్కొంటున్న సాగునీటి కష్టాలను తీర్చేందుకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సీఎం కేసీఆర్ రూ.786కోట్లతో తుంగభద్ర నదీతీరంలో రాజోలి మండలం తుమ్మిళ్ల వద్ద ఎత్తిపోతలు ప్రారంభించారు. ఫేస్-1లో భాగంగా రూ.134 కోట్లతో తుమ్మిళ్ల పంప్ హౌస్, స్టచ్చర్ నిర్మాణం, సబ్స్టేసన్ నిర్మాణం పను లు పూర్తిచేశారు. కొంతమేరకు ఆయకట్టు భూములకు సాగునీరందించారు. ఫేస్-2 దాదాపు రూ.490 కోట్లు వెచ్చించి మల్లమ్మకుంట, జూలేకల్, వల్లూ రు రిజర్వాయర్లు పూర్తి చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతిలో భాగంగా గ్రామాలు, పట్టణాలను అభివృద్ధి చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ అందిస్తున్న పారదర్శక పాలన, ప్రభుత్వ సంక్షేమ పథకాలే బీఆర్ఎస్కు అండగా నిలుస్తూన్నాయి.
నియోజకవర్గంలోని ఆయా మండలాలు, మున్సిపాలిటీలు అన్నివిధాల అభివృద్ధికి నోచుకున్నాయి. నియోజకవర్గం కేంద్ర బిందువుగా ఉన్న అలంపూర్ చౌరస్తాలో రూ.21కోట్లతో వంద పడకల దవాఖాన, అయిజ మండలంలో 30 పడకల దవాఖానలో అధునీకరణ పనులకు రూ.80లక్షలు, అలంపూర్ ఐసీయూలో ఆధునీకరణ కోసం రూ.60లక్షలు, డయాలసిస్ కోసం రూ.60 లక్షలు, పట్టణంలోని సీహెచ్సీ దవాఖాన, మార్చురీ మరమ్మతుకు రూ.2కోట్ల 8లక్షలు ఖర్చు, రూ.3కోట్ల60లక్షలతో 18 హెల్త్ సబ్ సెంటర్ల ఏర్పాటు, డిగ్రీ కళాశాలలు, మండలానికో కేజీబీవీ రెసిడెన్షియల్ పాఠశాల, ఇరిగేషన్ పరంగా తుమ్మిళ్ల ఎత్తిపోతల నుంచి 55వేల ఎకరాలకు సాగునీరు, మల్లమ్మకుంట రిజర్వాయర్, రూ.13.50కోట్లతో ఆర్డీఎస్ కాలువలో పూడిక తీత పనులు, రూ.కోటి30లక్షలతో తుంగభద్ర నదిపై గుందిమల్ల, బుక్కాపురం ఎత్తిపోతల పథకాల మరమ్మతుకు కేవలం ఇరిగేషన్ కోసమే రూ.384కోట్ల నిధులు ప్రభుత్వం ఖర్చు చేసింది.
నియోజకవర్గంలోని అలంపూర్, వడ్డేపల్లి, అయిజ మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు పరుగులు తీస్తున్నాయి. మొదట ఒక్కో మున్సిపాలిటీకి రూ.10కోట్ల చొప్పున మంజూరు కాగా సెంట్రల్ డివైడర్ కం లైటింగ్, డ్రైనేజీ పనులు, వార్డుల్లో సీసీరోడ్డు పనులు, పార్కులు, వైకుంఠధామాలు, వెజ్ నాన్వెజ్ మార్కెట్లు నిర్మించారు. గతనెలలో జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభకు హాజరైన సందర్భంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట మేరకు ఒక్కో మున్సిపాలిటీకి రూ.25కోట్ల చొప్పున మంజూరు చేశారు. అదేవిధంగా ఒక్కో గ్రామ పంచాయతీకి రూ.10లక్షల చొప్పున మంజూరు చేయడంతో మరింత అభివృద్ధికి సాధ్యమైంది. బాలికల ఉన్నత చదువుల కోసం అలంపూర్కు మహిళా డిగ్రి రెసిడెన్షియల్ కాలేజీ ఇప్పటికే మంజూరైంది. అయిజ మున్సిపాలిటీలో రూజ44.80 కోట్లు ఖర్చుచేసి ఇంటిగ్రేటెడ్ మార్కెట్, వెజ్, నాన్వెజ్ మార్కెట్, మున్సిపాలిటీలో సెంట్రల్ లైటింగ్ డివైడర్, మిషన్ భగీరథతో ఇంటింటికీ కొళాయిలు, పార్కుల ఏర్పాటు, అంతర్గత సీసీరోడ్లు, డ్రైనేజీలు, పట్టణంలో బీటీరోడ్లు, వైకుంఠధామాలు తదితర పనులు పూర్తయ్యాయి.
ఏదైన ప్రాంతం అభివృద్ది చెందాలంటే రోడ్డు, రవాణా, నీటి సౌకర్యం, కరెంటు తప్పనిసరి. అటువంటి తరుణంలో ప్రభుత్వం నియోజకవర్గంలోని ప్రతిపల్లెకు మండల కేంద్రాలను కలుపుతూ.. తారురోడ్డు వేయించడం, సబ్స్టేషన్ ఏర్పాటు, మిషన్ భగీరథ పథకం నుంచి ప్రతిఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ స్పెషల్ డెవలప్ మెంట్ ఫండ్సు నుంచి రూ.56కోట్లు ఖర్చు చేసింది. ఆర్ఎండ్బీ శాఖ నుంచి రూ.26కోట్లతో వంతెనల నిర్మాణాలు, రూ.40కోట్లతో అవకాశమున్న ప్రతిగ్రామానికి తారురోడ్డు వేయించి రవాణా సౌకర్యాలు మెరుగుపర్చింది.
రాష్ట్ర సరిహద్దులో అలంపూర్ మండలం ర్యాలంపాడు, సుల్తానాపురం, జిల్లేలపాడు తదితర నది ఆవలి గ్రామాలకు సరైన రోడ్డుమార్గం లేకుండే. తెలంగాణ ప్రభుత్వ హయాంలో ఇంటింటికి మిషన్ భగీరథ తాగునీరు, తెలంగాణ ప్రభుత్వ విద్యుత్, గతంలో ఏపీ ప్రభుత్వం నుంచి విద్యుత్ వచ్చేది. తుం గభద్ర నదిపై రూ.35కోట్లతో అలంపూర్- ర్యాలంపాడు గ్రామా ల మధ్య నదిపై వంతెన నిర్మించిన తర్వాత రాకపోకలతోపాటు మన విద్యుత్, మనతాగు నీరు అందుతున్నది. రూ.9కోట్లతో తారురోడ్డు, వంతెన పనులు కొనసాగుతున్నాయి. రూ.13కోట్లను ఆర్డీఎస్ డి-24నుంచి 40వరకు ఆధునీకరణ పనులకు కేటాయించారు.
ప్రజలే పార్టీకి బలం బలగం.. ప్రజాసంక్షేమ పథకాలే ప్రభుత్వానికి శ్రీరామ రక్ష అన్నారు. పారదర్శక పాలన అందిస్తున్న కేసీఆర్ రామరాజ్యం స్థాపించాడు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వందశాతం అమలు చేస్తూ తోటి రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచింది. ప్రభుత్వం మంజూరు చేసిన అభివృద్ధి పథకాల అమలు క్షేత్రస్థాయిలో నేను అమలు చేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాను. పిలిస్తే పలికే నాయకుడిలా ధనిక, పేద తేడా లేకుండా అందరికీ అందుబాటులో ఉండేవిధంగా ఉన్న అభ్యర్థిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిండెంట్ సెలక్ట్ చేశారు. సంక్షేమ పథకాలు అందిస్తున్న ప్రభుత్వం, బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడును నియోజకవర్గ ప్రజలు మరోమారు ఆదరిస్తారనే నమ్మకం బలంగా ఉంది.