వనపర్తి టౌన్, సెప్టెంబర్ 12 : ముందుచూపు, సుదూర లక్ష్యంతో రానున్న తరానికి ఏమి కావాలో ఆలోచన చేసి వనపర్తి జిల్లాలో విద్యాసంస్థలను నెలకొల్పినట్లు వ్యవసా య శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో మంగళవారం ఉపాధ్యాయులతో ఆత్మీయ సమ్మేళనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఏడేండ్ల కిందట అమెరికాలోని బోస్టన్ నగరంలో ఉన్న హార్వర్డ్ యూనివర్సిటీని సం దర్శించి సమూలమైన ఆలోచనతోనే వనపర్తిలో జేఎన్టీ యూ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫిషరీస్, ఫార్మసీ, మత్స్య, మెడికల్ కళాశాలలను ప్రారంభించామన్నారు.
త్వరలోనే మేనేజ్మెంట్ కోర్సులు (ఎంబీఏ), లా, వెటర్నరీ కళాశాలలు ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో వనపర్తిని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నట్లు వివరించారు. ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరిస్తామన్నారు. ఉపాధ్యాయులు ఉద్యమ పాఠాలు, స మాజం బాగుపడాలని కోరుకుంటారన్నారు. వనపర్తి జిల్లా లో పలు అభివృద్ధి పనులు, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన చేసేందుకు త్వరలో ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారన్నారు.
75 ఏండ్ల గోసను దృష్టిలో ఉంచుకొని మంచినీటి పథకాలు, ఐటీటవర్, సమీకృత మార్కెట్, గ్రంథాల యం పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నట్లు తెలిపారు. ముందుగా వనపర్తి అభివృద్ధిపై రూ పొందించిన డాక్యుమెంటరీని ప్రదర్శించారు. అనంతరం రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయురాలు మునీంద్రమ్మను సత్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్మన్ లోకనాథ్రెడ్డి, ము న్సిపల్ చైర్మన్ గట్టుయాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ ర మేశ్గౌడ్, వైస్ చైర్మన్ శ్రీధర్, బీఆర్ఎస్ నియోజకవర్గ ఇ న్చార్జి ప్రమోద్రెడ్డి, పట్టణ ఇన్చార్జి ప్రకాశ్, వరప్రసా దరావు, రవిప్రసాద్గౌడ్, సుబ్బలక్ష్మి పాల్గొన్నారు.