జడ్చర్ల, అక్టోబర్ 31 : కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక స్థా యిలోనే టికెట్లు అమ్ముకుంటున్నదని, ఇక వారికి అధికారమిస్తే రాష్ర్టాన్ని బజారులో పెట్టి విక్రయించే పరిస్థితి నెలకొంటుందని బీఆర్ఎస్ మహబూబ్నగర్ జిల్లా అ ధ్యక్షుడు, జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అన్నారు. జడ్చర్లలోని చంద్రాగార్డెన్స్లో మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్తో కలిసి ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మంగళవారం విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్కు రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమంపై దృష్టి ఉండదని, కేవలం ఓటు రాజకీయం మాత్రమే తె లుసన్నారు. ఆరు గ్యారెంటీల పేరిట మోసం చేస్తుందన్నారు. అధికారంలోకి వస్తే 3 గంటలు కరెంటు ఇస్తామని ఇప్పటికే రేవంత్రెడ్డి ప్రకటించారన్నారు. కాంగ్రెస్ కు ఓట్లు వేసి మోసపోయామని కర్ణాటకలో రైతులు రో డ్ల మీదకు వస్తున్నారన్నారు. కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ను ఎన్నికల ప్రచారానికి పిలిస్తే.. మా వద్ద 5 గంటల కరెంటు మాత్రమే ఇస్తున్నామని చెప్పారన్నా రు. వారి మాటలు వింటే గోసతప్పదని హెచ్చరించారు. బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ప్రజారంజకంగా ఉందన్నారు. రైతుబీమా తరహాలో తెల్లరేషన్ కార్డు దారులకు కేసీఆర్ బీమా పథకాన్ని అమలు చేస్తామన్నారు. సౌభాగ్యలక్ష్మి పథకం ద్వారా పేద మహిళలకు నెలకు రూ.3వేలు ఇస్తామన్నారు. హామీలన్నీ సీఎం కేసీఆర్తోనే సాధ్యమని ప్రజలు గుర్తించారని, మూడోసారి బీఆర్ఎస్ విజయం తథ్యమని దీమా వ్యక్తం చేశారు. అందరం కలిసికట్టుగా పనిచేసి బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ అనుచరులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ యాదయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి, సంగీత, నాటక అకాడమి మాజీ చైర్మన్ శివకుమార్, ముడా డైరెక్టర్ రవిశంకర్, ఇంతియాజ్, కౌన్సిలర్లు ప్రశాంత్రెడ్డ్డి, ఉమాశంకర్గౌడ్, జ్యోతి, దేవ, న్యాయవాది జంగయ్య, రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు.
జడ్చర్లటౌన్, అక్టోబర్ 31 : సర్దార్ వల్లభాయ్ పటేల్ సిద్ధాంతాలు, జీవితం స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. జడ్చర్లలో సర్దార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో వల్లభాయ్ పటేల్ యువజన సంఘం సభ్యులు
నవాబ్పేట, అక్టోబర్ 31 : మండలంలోని కిషన్గూడ, గుబ్బడిగుచ్చతండాకు చెందిన లక్ష్మణ్, రూప్లా, సామ్య, ఎల్లయ్యతోపాటు 10 మంది కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో నాయకులు చెన్నయ్య, నరేశ్, గోపాల్ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్, అక్టోబర్ 31 : కాంగ్రెస్ నేతల కల్లబొల్లి మాటలు నమ్మి ప్రజలు మోసపోవద్దని, ప్రజా సంక్షే మం కోసం పనిచేసే బీఆర్ఎస్ను గెలిపించుకోవాలని ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. మండలంలోని ఎక్వాయపల్లిలో ఎన్నికల ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకులు ఎ మ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. చెన్నంగులగడ్డతండాలో కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించా రు. నేరళ్లపల్లి ఉర్సులో ప్రార్థనలు చేశారు. ఆయా కార్యక్రమాలలో టీజీసీసీ చైర్మన్ వాల్యానాయక్, డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్రెడ్డి, జెడ్పీటీసీ కల్యాణి, నాయకులు లక్ష్మణ్నాయక్, జగన్నాయక్, శ్రీనివాసరావు, గోపాల్రెడ్డి, మంజునాయక్, సర్పంచులు తదితరులున్నారు.