నాగర్కర్నూల్, ఫిబ్రవరి 22 : లక్ష్యాలకు అనుగుణంగా బ్యాంకర్లు లబ్ధిదారులకు రుణాలు అందించాలని అదనపు కలెక్టర్ కుమార్దీపక్ సూచించారు. గురువారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కాన్ఫరెన్స్ హాల్లో జిలా ్లస్థాయి బ్యాంకర్ల సంప్రదింపుల కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని బ్యాంకులకు కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ప్రగతి గురించి సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో యువతకు ఉన్నత విద్య కోసం ఎక్కువ శాతం రుణాలు అందించడం ద్వారా యువత ఉన్నత విద్యా ప్రమాణాలను పొంది బంగారు భవిష్యత్తుకు ఉపయోగపడుతుందన్నారు. రైతులకు పంట రుణాలు, టర్మ్లోన్లు, వ్యవసాయ అనుబంధ రుణాలు విరివిగా అందించాలని సూచించారు.
పంట రుణాల పంపిణీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, పరిశ్రమలు, డీఆర్డీవో తదితర శాఖల ద్వారా ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల మేరకు బ్యాంకులు ఉపాధి యూనిట్ల స్థాపన, చిన్న, మధ్య తరహా, విద్య, గృహ నిర్మాణం, ఇతర ప్రాధాన్యత రంగాలకు అర్హులైన లబ్ధిదారులకు మంజూరు చేయాలని కోరారు. చిరు వ్యాపారులు తమ వ్యాపారాలను విస్తరించుకోవడానికి అవగాహన కలిగిస్తూ రుణాలు అందించాలని కోరారు.
ప్రభుత్వ శాఖల అధికారులు, బ్యాంకర్లు సమన్వయంతో నిర్ధేశించిన లక్ష్యాలను సాధించేందుకు నిర్ణీత గడువులోగా రుణాలు మంజూరు చేయాలని ఆదేశించారు. ప్రతి రెండు నెలలకు ఒకసారి తప్పనిసరిగా బ్యాంకర్లు బెనిఫిషరీ మీటింగ్ ఏర్పాటు చేయాల్సిందిగా సూచించారు. ఆర్థిక అక్షరాస్యత, నగదు రహిత డిజిటల్ లావాదేవీలపై అవగాహన కలిగించాలన్నారు. స్వయం సహాయక సంఘాలకు పూర్తిస్థాయిలో లింకేజీ రుణాలు పంపిణీ చేయాలని, సబ్సిడీ రుణాల పంపిణీలో జాప్యం చేయవద్దని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి విశ్వకర్మ పథకం కింద దరఖాస్తు చేసుకునే చేతివృత్తుల వారికి సత్వరమే రుణ సదుపాయం కల్పించాలన్నారు.