కొందరికి చదవాలని ఉత్సా హం ఉన్నా అవగాహన లేకపో వడం.. మార్గదర్శనం చేసే వారు లేక పోవడం.. ఏదో కళాశాలలో చేరడం.. అనుభవం లేని ఫ్యాకల్టీ బోధనతో చదువులో వెనుకబడటం.. చదువు పూర్తయినా ఉద్యోగాలు లేక ఇబ్బందులు పడటం.. అలాంటి వారికి కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ ప్రిన్సిపాల్ కోటేశ్వర్ రావు అవగాహన కల్పించారు. శనివారం వనపర్తి స్కాలర్స్, సీవీ రామన్ కళాశాలలో ‘నమస్తే తెలంగాణ’, ‘తెలంగాణ టుడే’, ‘కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ’ ఆధ్వర్యంలో ‘లక్ష్యం-2023’ పై ఉన్నత విద్యావకాశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కోటేశ్వర్ రావు మాట్లాడుతూ లక్ష్యం నిర్ధేశించుకొని చదవాలని సూచించారు.
వనపర్తి, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : చదవాలనే ఆశయం ఉన్నా అవగాహన లేక చాలా మంది విద్యార్థులు వెనుకబడుతున్నారు. సరైన మార్గదర్శనం లేక ఏదో ఒక కాలేజీలో చేరి.. అర్హత లేని ఫ్యాకల్టీ చెప్పే పాఠాలు విని.. చదువు పూర్తయ్యాక ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతుంటారు. లక్షలాది మంది విద్యార్థులు ప్లేస్మెంట్ లేక తల్లి దండ్రుల మీద ఆధారపడడం చూస్తున్నాం. భవిష్యత్ బాగుండాలంటే ఇంటర్ దశలోనే విద్యార్థులకు ఉన్నత విద్యపై అవగాహన ఉండాలి.
ఇందుకోసం శనివారం వనపర్తి జిల్లాలోని స్కాలర్స్, సీవీ రామన్ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ‘లక్ష్యం-2023’పై అవగాహన సదస్సు నిర్వహించారు. సుమారు రెండు వేల మంది సదస్సు కు హాజరయ్యారు. నేటి ఆలోచనే రేపటి భవితకు బాటలు వే స్తుంది. ఉన్నత విద్య అందించే కాలేజీల్లో చేరితే లక్ష్యం దానంత ట అదే నెరవేరుతుంది. కరిక్యులమ్, సిలబస్ రెండింటికీ ప్రా ధాన్యమిస్తూ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి తోడ్పాటందించే విద్యా సంస్థలను ఎంపిక చేసుకోవాలి.
ఈ క్రమంలో విద్యార్థులు ఇంటర్ తర్వాత ఏ కోర్సు చదవాలి.. ఏ యూనివర్సిటీలో చేరితే బాగుంటుంది అనే విషయాలపై కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎల్.కోటేశ్వర్రావు అవగాహన కల్పించారు. ఇంటర్ తర్వాత తప్పటడుగు వేస్తే భవిష్యత్ అంధకారం అ వుతుందన్నారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్, బ్యూరో ఇన్చార్జి వెంకటేశ్వర్రావు, ఎడిషన్ ఇన్చార్జి సత్యనారాయణరెడ్డి, ఏడీవీటీ మేనేజర్ విజయ్కుమార్రె డ్డి, స్కాలర్స్ కళాశాల యాజమాన్య సభ్యులు డాక్టర్ జగదీశ్వర్, వరప్రసాద్రావు, ప్రిన్సిపల్ శ్రీధర్, సీవీ రామన్ కళాశాల యాజమాన్య సభ్యులు డాక్టర్ వీరయ్య, కుమారస్వామి, ప్రిన్సిపల్ ప్రకాశ్ పాల్గొన్నారు.
తెలుగు రాష్ర్టాల్లో ‘కేఎల్యూ’ నెంబర్వన్..
కేఎల్ యూనివర్సిటీ తెలుగు రాష్ర్టాల్లో నెంబర్వన్ స్థానంలో ఉన్నది. నాణ్యతా ప్రమాణాలతో కూడిన బో ధన, వందశాతం ప్లేస్మెంట్ కల్పిస్తున్నది. ఒక్కో విద్యార్థికి నాలుగు నుంచి ఐదు ఉద్యోగాలకు మంచి ప్యాకేజీ తో సెలక్ట్ అవుతున్నారు. దేశం, ప్రపంచంతో పోటీపడే లా విద్యార్థులను సిద్ధం చేస్తున్నాం. విద్యార్థులు ఇం టర్ తర్వాత ఉత్తమ బోధన, ఫ్యాకల్టీ, ప్లేస్మెంట్స్ అం దించే ఉన్నత విద్యా సంస్థలను ఎంపిక చేసుకోవాలి. ఐఐటీ, ఎన్ఐటీలకు దీటుగా న్యాక్, ఎన్ఐఆర్ఎఫ్ 27 వ ర్యాంకింగ్తో అత్యుత్తుమ ప్రమాణాలతో విద్యాబోధ న చేపడుతున్నాం.
అతి తక్కువ కాలంలోనే కేఎల్ యూనివర్సిటీ హైదరాబాద్ క్యాంపస్ శాస్త్ర, సాంకేతిక, వైజ్ఞానిక రంగాల్లో వెలుగులోకి వచ్చింది. ఇక్కడి విద్యార్థులు బీటెక్ తృతీయ సంవత్సరంలోనే ఇంటర్న్షిప్, ప్లేస్మెంట్స్కు ఎంపికవుతున్నారు. విద్యాలక్ష్మి పోర్టల్తో స్కాలర్షిప్లు, విద్యారుణాలు పొందే అవకాశాన్ని కల్పిస్తున్నాం. నిత్యం లెక్చర్ ట్యుటోరియల్స్, ప్రాక్టీస్ చేయిస్తున్నాం. తరగతులు ముగియగానే టీ హబ్కు వెళ్లి అధికారులు, ఉద్యోగులతో ముఖాముఖి నిర్వహిస్తున్నాం. ఇలాంటి ఉత్తమ ఫ్యాకల్టీ, ప్రమాణాల తో కూడిన కేఎల్యూను ఎంపిక చేసుకోవాలి. బైపీసీ తో కూడా ఇంజినీరింగ్ చేయవచ్చు. దేశం మొత్తంలో 32 క్యాటగిరీ వన్ కళాశాలలు ఉంటే తెలుగు రాష్ర్టాల్లో ఉన్న ఏకైక యూనివర్సిటీ కేఎల్ డీమ్డ్. మిగతా కాలేజీలతో పోలిస్తే ఫీజు ఎక్కువగా ఉన్నమాట వాస్తవమే. కానీ ప్లేస్మెంట్ ప్యాకేజీ ఎక్కువ లభిస్తుంది.
సందేహాలను నివృత్తి చేశారు..
కెరీర్ గైడెన్స్పై నిర్వహించిన సదస్సు చాలా ఉపయోగపడుతుంది. ఇంటర్ తర్వాత కోర్సులపై పూర్తి అవగాహన వచ్చింది. సందేహాలను నివృత్తి చేశారు. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ, నమస్తే తెలంగాణ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సుతో సైబర్ సెక్యురిటీ, డిజిటల్ నెట్వర్క్, ఎలక్ట్రికల్, , నెట్వర్క్స్ అప్లికేషన్లపై పూర్తిస్థాయి అవగాహన వచ్చింది. కేఎల్ డీమ్డ్ యూనివర్సీటీలో చేరి మంచిగా చదివి తల్లిదండ్రులకు మంచి పేరు ప్రతిష్టలు తీసుకొస్తా.
భవిష్యత్కు తోడుగా నిలుస్తుంది..
కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ, నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన సదస్సు విద్యార్థులకు ఎంతో ఉపయోగపడుతుది. ఉన్నత చదువులపై ఇచ్చిన గైడ్లెన్స్ వారి భవిష్యత్కు తోడుగా నిలుస్తాయి. విద్యార్థులు సద్వినియోగం చేసుకుంటే వంద శాతం లక్ష్యాన్ని చేరకుంటారనడంలో సందేహం లేదు. యూనివర్సిటీకి చెందిన వారే వచ్చి ఉన్నత చదువులపై అవగాహన కల్పించడం అభినందనీయం.
– జగదీశ్వర్, స్కాలర్స్ కళాశాల యాజమాన్య సభ్యుడు
బైపీసీ తరువాత బీటెక్ చేయొచ్చు..
బైపీసీ విద్యార్థులు కేవలం మెడిసిన్, అగ్రికల్చ ర్, ఫార్మసీ తదితర కోర్సులు మాత్రమే చేయొచ్చన్నది అందరికీ తెలుసు. కానీ కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ, నమస్తే తెలంగాణ ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సు ద్వారా చాలా విషయాలు తెలుసుకున్నాను. బైపీసీ తరువాత బీటెక్ చేయాలనుకున్న వారికి చాలా చక్కని అవకాశాలు ఉంటాయని వివరించారు. చాలా మందికి ఇది ఒక సువర్ణ అవకాశం.
– కమల శ్రీ, బైపీసీ సెకండియర్, స్కాలర్స్ జూనియర్ కళాశాల
చాలా విషయాలు నేర్చుకున్నా..
ఇంటర్ తరువాత బీటెక్ చేయాలన్న ఆలోచన మాత్రమే ఉండేది. కా నీ, అవగాహన సదస్సు ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నా ను. బీటెక్లో ఏ కోర్సు చేస్తే భవిష్యత్లో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు అనే దానిపై వివరించారు. ఇప్పుడు నా కు ఒక క్లారిటీ వచ్చింది. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ద్వారా నాకు ఇష్టమైన కోర్సు చేస్తాను. మంచిగా చదివి తల్లిదండ్రులు, కళాశాలకు పేరు తీసుకొస్తానన్న నమ్మకం వచ్చింది. – అమీర్ సాహిల్,
ఎంపీసీ సెకండియర్, స్కాలర్స్ కళాశాల
చక్కని ప్రణాళికతో ముందుకుసాగాలి..
విద్యార్థులు చక్కని ప్రణాళికతో ముందుకుసాగి ఉన్నత లక్ష్యాలకు చేరుకోవాలి. సరైన సమయంలో మంచి నిర్ణయాన్ని తీసుకొని ఉన్నత లక్ష్యాలను ఏర్పర్చుకోవాలి. నిపుణుల సలహాలు, సూ చనలు తీసుకోవాలి. అందుకు అనుగుణంగా ప్రణాళికబద్దంగా చదవాలి. విద్యార్థులకు మంచి గైడెన్స్ను అందించారు. జాతీయ స్థాయిలో కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంతో పేరుగాంచింది. కేఎల్యూ వారు మా కళాశాల విద్యార్థులకు సలహాలు ఇవ్వడం సంతోషంగా ఉన్నది.
– ప్రకాశ్, ప్రిన్సిపాల్, సీవీ రామన్ జూనియర్ కళాశాల, వనపర్తి
లక్ష్యం వైపు అడుగులు వేస్తా..
ఇంటర్ తర్వాత ఏ కోర్సును ఎంపిక చేసుకుంటే మంచిదనే విషయాలను చాలా బాగా వివరించారు. లక్ష్యం వైపు అడుగులు వేస్తాను. కేఎల్ డీమ్డ్ యూనివర్సిటీ వారు కల్పించిన అవగాహన ఎంతో ఉపయోగపడుతుంది. భవిష్యత్లో ఏదైనా సాధించాలంటే మొదటగా మార్గాన్ని ఎంచుకోవాలని తెలుసుకున్నాను. లక్ష్యాన్ని చేరుకోవాలన్న తపన పెరిగింది. కేఎల్యూలో చేరితే విద్యాలక్ష్మి ద్వారా తక్షణమే రుణాలు పొందే అవకాశం కల్పించడం అభినందనీయం.
– సిరి, ఇంటర్ సెకండియర్, సీవీ రామన్ కళాశాల