మహబూబ్నగర్, డిసెంబర్ 28 : గొర్రె ల పరిశోధనాకేంద్రంపై ఎలాంటి అపోహ అవసరంలేదని రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్యాదవ్ అన్నారు. జిల్లా కేంద్రంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో యాదవ సంఘం నాయకులతో కలిసి ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. పశుసంవర్ధకశాఖ పరిధిలోని గొర్రెలకాపరుల అవసరాల నిమిత్తం కేటాయించిన స్థలాన్ని వివిధ శాఖలకు ఎలా మ ళ్లించారన్న విషయం ప్రతిఒక్కరికీ తెలియాల్సిన అవసరం ఉందన్నారు.
1957లో సర్వేనెంబర్ 631లో 315 ఎకరాలను అప్పటి సీఎం నీలం సంజీవరెడ్డి పాలిటెక్నిక్ వెటర్నరీకి కేటాయించగా, 1964లో పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చిందన్నారు. ఇక్కడ గొర్రెల రీసెర్చ్ కేంద్రం, వెటర్నరీ డాక్టర్ల పరిశోధనలకు సదుపాయాలను కల్పించినట్లు తెలిపారు. 1971లో పాలశీతలీకరణ కేంద్రానికి 10 ఎకరాలు, ఇందిర మ్మ ఇండ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, సిమెం ట్ రింగుల తయారీ, నిర్మిత్ కేంద్రానికి మ రో 10ఎకరాల భూమిని ఇచ్చినట్లు వివరించారు.
అలాగే దుర్గాబాయి దేశ్ముఖ్ మహిళావిభాగానికి, జిల్లా మహిళా సమాఖ్య భవ నం, ఆర్టీవో కార్యాలయం, డ్రైవింగ్ ట్రాక్ కోసం ఇదే సర్వేనెంబర్లోని భూమిని కేటాయించినట్లు తెలిపారు. పాలమూరు యూ నివర్సిటీకి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి 155 ఎకరాలను కేటాయించినట్లు వివరించారు. అలాగే బైపాస్రోడ్డుకు కూడా కొంత భూమి పోయిందని తెలిపారు. ప్రస్తుతమున్న సుమారు 36ఎకరాల్లో వెటర్నరీ పాలిటెక్నిక్, వసతిగృహం, గొర్రెల పరిశోధనాకేంద్రం, గొర్రెలు తిరగడానికి అనువైన స్థలం తదితర సదుపాయాలను కల్పించినట్లు చెప్పారు.
ప్రస్తుతం 10 ఎకరాల స్థలా న్ని కోర్టుకు కేటాయించినప్పటికీ మరో 20ఎకరాల భూమిని గొర్రెల పరిశోధనా కేంద్రానికి కేటాయించి మరింత అభివృద్ధి చేస్తామని మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేయడం జరిగిందన్నారు. దీనిపై ఎలాంటి అపోహ అవసరంలేదన్నారు. అలాగే కలెక్టర్ వెంకట్రావు సానుకూలంగా స్పందించి జిల్లా రెవెన్యూ యంత్రాంగం, వెటర్నరీ పరిశోధన శాస్త్రవేత్తలు దక్కన్ గొర్రెల కోసం అనువైన స్థలాన్ని ఎంపిక చేసేందుకు కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
సమావేశంలో గొర్రెల పెంపకదారుల సహకార సం ఘం జిల్లా అధ్యక్షుడు శాంతయ్యయాదవ్, హన్వాడ మండల రైతుబంధు సమితి అధ్యక్షుడు మెండె రాజుయాదవ్, ముడా డైరెక్టర్ సాయిల్యాదవ్, మున్సిపల్ కౌన్సిలర్ కోట్ల నర్సింహులుయాదవ్, అఖిలభారత యాదవ సంఘం జిల్లా ప్రధానకార్యదర్శి రమేశ్యాదవ్, పట్టణ అధ్యక్షుడు తాటికొండ నర్సింహులు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ చెన్నయ్య తదితరులు ఉన్నారు.