హరీస్.. ఈ పదం వింటే చాలు ఇట్టే నోరూరుతుంది. రంజాన్ మాసంలో తయారు చేసే ఈ వంటకానికి ఎం తో ప్రత్యేకత ఉన్నది. పొట్టేలు మాంసం లేదా చికెన్తోపాటు నెయ్యి, గోధుమ, రవ్వతో తయారు చేసే ఈ వం టకం పోషకాహారం కావడంతో కేవలం ఉపవాస ప్రార్థనలు చేసే ముస్లింలే కాకుండా అన్నివర్గాల ప్రజలు రుచి చూసేందుకు తహతహలాడుతారు. ప్రజల అభిరుచికి అనుగుణంగా వివిధ హోటళ్లలో ప్రత్యేకమైన వంటకాల ను తయారు చేసి జోరుగా విక్రయాలు చేస్తున్నారు. దీం తో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో సాయంత్రం అ య్యిందంటే చాలు హరీస్ దుకాణాలు కిటకిటలాడిపోతున్నాయి.
మహబూబ్నగర్ టౌన్, మార్చి 31 : ఒకప్పుడు హైదరాబాద్ వంటి మహానగరానికే పరిమితమైన ఈ ఇరానీ వంటకం..
నేడు అన్ని పట్టణాలకు వ్యాపించింది. ముఖ్యంగా రంజాన్ మాసంలో తయారు చేసే, హలీం, హరీస్లకు భలే గిరాకీ. బలమైన ఆహారంగా భావించి రంజాన్ మాసంలో ఉపవాస దీక్షలు చేసే వారు ఈ వంటకాన్ని ఆరగించేందుకు ఇష్టపడుతున్నారు. కేవలం ముస్లింలే కాకుండా అన్నివర్గాల ప్రజలు ఈ హరీస్ను తినేందుకు ఆసక్తి కనబరుస్తారు. ఈ ఏడాది పెద్ద సంఖ్యలో హరీస్ విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోనే దాదాపు 40కిపైగా విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మటన్ హలీం ప్లేట్ రూ.200 నుంచి రూ.270 వరకు, చికెన్ హలీం రూ.70 నుంచి రూ.120 వరకు విక్రయిస్తున్నారు. ఆపర్లతో జోరుగా అమ్మలు సాగిస్తున్నారు.
40 ఏండ్ల నుంచి మా కుటుంబం హోటల్తోపాటు హరీస్ సెంటర్ నడుపుతున్నాం. మటన్ హరీస్ ఒక టి కొంటే ఒకటి ఉచితంగా ఇస్తు న్నాం. హరీస్ రుచితోపాటు పోషకాహారం అందిస్తుంది. ఈ ఏడాది హరీస్ సెంటర్లు పెరగడంతో పోటీ పెరిగింది. మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉండే ధరలు ఉన్నాయి.