జడ్చర్ల టౌన్, మే 24 : మండలంలోని గోప్లాపూర్లో వ్యవసాయ, పోలీసుశాఖల అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించి ఓ ఇంట్లో నిల్వ ఉన్న 2.21 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వా ధీనం చేసుకున్నారు. జడ్చర్ల పీఎస్లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఎస్పీ రాములు వివరాలను వెల్లడించారు. ప్రభాకర్రెడ్డి, సుధాకర్రెడ్డి నకిలీ పత్తి విత్తనాలను విక్రయించేందుకు గోప్లాపూర్లో భారీగా నిల్వ చేసినట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. దీంతో గురువారం అ ర్ధరాత్రి వ్యవసాయ, పోలీసుశాఖల అధికారులు గ్రా మంలో ఆకస్మికంగా తనిఖీలు చేసి 2.21 క్వింటాళ్ల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకొని ఇద్దరినీ అదుపులోకి తీసుకున్నట్లు వివరించారు. గోప్లాపూర్కు చెందిన ప్రభాకర్రెడ్డి, సుధాకర్రెడ్డి గుంటూరు నుంచి ఈ విత్తనాలను తీసుకొచ్చి ఇక్కడి అమాయ క రైతులకు అమ్మేందుకు నిల్వ చేసినట్లు ఏఎస్పీ తెలిపారు. పట్టుబడిన విత్తనాలను ల్యాబ్కు పంపిం చి, ఇద్దరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామ న్నారు. జిల్లాలో నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు ఎస్పీ, కలెక్టర్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి టీంతో పాటు మండలస్థాయిలో 15 ప్రత్యేక టీంలు పనిచేస్తున్నాయన్నారు.
ఒక్కో టీంలో సీఐ, ఎస్సైతోపాటు వ్యవసాయశాఖాధికారులు ఉన్నట్లు తెలిపారు. ఇతర రాష్ర్టాల నుంచి జిల్లాకు నకిలీ విత్తనా లు రాకుండా సరిహద్దు ప్రాంతాల్లో ప్రత్యేక చెక్పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. అలాగే విత్తనాల తయారీ యూనిట్లు, డీలర్ల షాపుల్లోనూ విస్తృతంగా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఇలాంటి కేసుల్లో ఉన్న పాతనేరస్తులను గుర్తించి మెజిస్ట్రేట్ ఎదుట బైండోవర్ చేస్తున్నామన్నారు. నకిలీ విత్తనాలను విక్రయిం చే వారిపై పీడీ యాక్ట్ కేసులు నమోదు చేస్తామన్నా రు. జిల్లా వ్యాప్తంగా నకిలీ విత్తనాల విక్రయాలను అరికట్టేందుకు పోలీసుశాఖ సహకారంతో తనిఖీలు చేస్తున్నామని డీఏవో వెంకటేశ్ అన్నారు. ఏఈవోల ఆధ్వర్యంలో నకిలీ విత్తనాలపై పోస్టర్లు, కరపత్రాలను పంపిణీ చేస్తూ రైతులకు అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు. తక్కువ ధరకు ఇస్తామనే దళారుల వద్ద విత్తనాలను కొనొద్దని, లైసెన్స్ ఉన్న దుకాణాల్లో ప్యాకింగ్తో ఉన్న విత్తనాలను కొనుగొలు చే యాలని సూచించారు. సదరు ప్యాకెట్తోపాటు బి ల్లులను జాగ్రత్తగా ఉంచుకుంటే భవిష్యత్తులో నష్టపరిహారం పొందే అవకాశాలుంటాయన్నారు. స మావేశంలో జడ్చర్ల సీఐ ఆదిరెడ్డి, ఏవోలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
ఊట్కూర్, మే 24 : మండలంలోని నిడుగుర్తి గ్రామంలో టాస్ఫోర్స్ బృందం, స్థానిక పోలీసు లు దాడులు నిర్వహించి 13.7కిలోల నకిలీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో గ్రామానికి చెందిన భీమప్ప ఇంటిపై దా డులు నిర్వహించి పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన విత్తన ప్యాకెట్లను పోలీస్ స్టేషన్కు తరలించి ఏవో గణేశ్రెడ్డి సమక్షంలో పంచానామా చేసినట్లు ఎస్సై శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు నిందితుడిపై కేసు నమోదు చేశామన్నారు. అధికారుల అనుమతులు లేకుండా నకిలీ విత్తనాల ను విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై హెచ్చరించారు.