జడ్చర్లటౌన్, డిసెంబర్ 23 : మున్సిపాలిటీ పరిధిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో అర్బన్ హెల్త్ సెంటర్ ఆధ్వర్యంలో శుక్రవారం వైద్య శిబిరాన్ని నిర్వహించారు. డాక్టర్ శివకాంత్ ఆధ్వర్యంలో 120 మంది విద్యార్థినులకు వైద్య పరీక్షలు ని ర్వహించారు. 15 మంది విద్యార్థినులకు ఆరోగ్య సమస్యల ను గుర్తించి రక్త నమూనాల కోసం అర్బన్ హెల్త్ సెంటర్కు పంపించారు. అనంతరం మందులు అందజేశారు. కొవిడ్ వ్యాప్తికి అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యార్థినులందరూ త గిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ శ్యామల, వైద్యసిబ్బంది, విద్యార్థినులు తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులకు దంత వైద్య పరీక్షలు
మూసాపేట, డిసెంబర్ 23 : మండలంలోని పోల్కంపల్లిలో శుక్రవారం 6 నుంచి 10వ తరగతి వరకు చదువుతు న్న విద్యార్థులకు ఉచితంగా దంత వైద్య పరీక్షలు చేసినట్లు ఎంఈవో నాగయ్య తెలిపారు. జిల్లాకేంద్రంలోని ఎస్వీఎస్ దంత వైద్య కళాశాల ఆధ్వర్యంలో దంత వైద్య నిపుణులతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. విద్యార్థులకు దంతాల పరిశీలన, క్లీనింగ్, పిప్పిపళ్లు సమస్యలు ఉన్న 20 మందికి శస్త్ర చికిత్స కోసం ఎస్వీఎస్కు రావాలన్నా రు. అవసరమైన వారికి ఉచితంగా మందు లు పంపిణీ చేయడంపాటు, పలు సూచన లు సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో వై ద్యులు, ఎంఈవో రాజేశ్వర్రెడ్డి, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
సద్వినియోగం చేసుకోవాలి
మహ్మదాబాద్, డిసెంబర్ 23 : ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని షష్ట్యాబ్ధి పూర్వవిద్యార్థుల కమిటీ ప్రధానకార్యదరి విజయానంద్రెడ్డి తెలిపా రు. మండలంలోని బాలుర ఉన్నత పాఠశాలలో సరోజినీ రాములమ్మ ఫార్మసీ కా లేజీ, ఎస్వీఎస్ మెడికల్ కాలేజీ వారి అనుబంధంతో షష్ట్యాబ్ధి పూర్వవిద్యార్థుల కమిటీ సహకారంతో శుక్రవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. వివిధ గ్రా మాల నుంచి వచ్చిన ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉ చితంగా మందులు పంపిణీ చేశారు. ఉచిత వైద్య శిబిరం ఏ ర్పాటుకు సహకారం అందించిన కాలేజీ చైర్మన్కు పీఆర్టీ యూ మండల శాఖ, షష్ట్యాబ్ధి పూర్వవిద్యార్థుల కమిటీ స భ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఫార్మ సీ కాలేజీ చైర్మన్ బాలరాజు, ప్రిన్సిపాల్ కోటేశ్వరి, అధ్యాపక బృందం, షష్ట్యాబ్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.