మహబూబ్నగర్, ఫిబ్రవరి 9 : వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న ప్రతి వి ద్యార్థికీ ఉపకార వేతనం మంజూరుకు చర్య లు తీసుకోవాలని కలెక్టర్ జి.రవినాయక్ ఆదేశించారు. కలెక్టరేట్లో గురువారం సం బంధిత అధికారులతో ఏర్పాటు చేసిన స మావేశంలో మాట్లాడారు. ప్రత్యేకాధికారు లు, సంక్షేమశాఖలు, మండలస్థాయి అధికారులు ఉపకార వేతనాల నమోదు ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, విద్యార్థులందరికీ పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు వచ్చేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో చదువుకుంటూ వసతిగృహాల్లో ఉంటున్న విద్యార్థుల జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. ఎవరైనా ఇతర మండలాలు, జిల్లాల నుంచి వచ్చినట్లయితే హాస్టళ్ల వార్డెన్లు అధికారులకు తెలియజేసి వారి వివరాలను తీసుకోవాలని తెలిపారు. ఎక్కడైనా ఎక్కువమంది విద్యార్థులు ఉంటే మొబైల్ ఆధార్ కిట్ను తీసుకెళ్లి ఆధార్ నమోదు చేయించేవిధంగా చర్యలు చేపట్టాలని ఈడీఎం చంద్రశేఖర్ను కలెక్టర్ ఆదేశించారు.
డిజిటల్ ఫొటోలు తీయించ డం, స్కాలర్షిప్ దరఖాస్తు చేయించే పూర్తి బాధ్యత హాస్టళ్ల వార్డెన్లదేనని అన్నారు. స్కా లర్షిప్ల కోసం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి డాటాఎంట్రీ చేయించాలని, ఇందుకుగానూ మండలాలు, కలెక్టరేట్లో కంప్యూటర్ ల్యాబ్లను ఏర్పాటు చేయాలన్నారు. విద్యార్థులు సమర్పించే ధ్రువపత్రాలు ఇతర విషయాలపై ప్రొఫార్మాలను రూపొందించడం జరిగిందని, వాటిని వెంటనే అన్ని హాస్టళ్లకు పంపిస్తామన్నారు. బ్యాంకు ఖాతా లు లేని వారికి జీరో ఖాతాను ఇప్పించాలని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సీతారామారావు, ఎస్సీ సంక్షేమశాఖ జిల్లా అధికారి పాండు, ఎస్టీ సంక్షేమశాఖ అధికారి చత్రూనాయక్, విద్యాశాఖ అధికారి యాద య్య తదితరులు ఉన్నారు.