అతనో సాధారణ కూలీ.. అవయవ దానం గురించి అవగాహన ఉంది.. అనారోగ్యంతో ఉన్న తాను చివరి క్షణంలో కుటుంబ సభ్యులను ఒప్పించి తన అవయవాలను దానం చేసి ముగ్గురి ప్రాణాలు నిలిపి పలువురికి ఆదర్శంగా నిలిచాడు.
– వనపర్తి రూరల్, జనవరి 6
వనపర్తి మండలం చిమనగుంటపల్లి గ్రా మానికి చెందిన పానుగంటి శాంతయ్య(53) హైదారాబాద్లో కూలీ పని చేస్తూ భార్యా, పిల్లలతో కలసి జీవనం కొనసాగిస్తున్నాడు. తన ముగ్గురు కుమారులను ఉన్నతంగా తీర్చిదిద్దిన ఆయన కొంత కాలం ఆనారోగ్యం తో యశోద దవఖానాలో చికిత్స పొందుతున్నాడు. తాను చనిపోతానని తెలుసుకున్న ఆయన వైద్యుల సలహా, సూచనతో అవయవాలను దానం చేసేందుకు కుటుంబ సభ్యులను ఒప్పించాడు. ఆయన ఈ నెల 3 వతేదీన అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయా డు. దీంతో దవాఖాన వైద్యులు ఆయన లివర్, కిడ్నీలను అవసరమైన ముగ్గురికి అమర్చారు. 4వ తేదీన శాంతయ్య మృత దేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించగా కర్మకాండ నిర్వహించేందుకు శుక్రవారం స్వగ్రామానికి తేగా విషయం తెలుసుకున్న గ్రామస్తులు భారీగా తరలి వచ్చి ఘనంగా నివాళులర్పించి తాను లేకున్నా మరో ముగ్గురికి ఊపిరిచ్చి వారి కుటుంబాల్లో ఆనందం నింపాడని కొనియాడారు.
విషయం తెలుసుకున్న వనపర్తి సహకార సంఘం చైర్మన్ వెంకట్రావ్, డైరెక్టర్లు గ్రామానికి చేరుకొని శాంతయ్య మృతదేహానికి పూలమాలలు వేసి నిళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ శాం తయ్య తాను చనిపోతూ మరో ముగ్గురికి పునర్జన్మనిచ్చి ఆదర్శంగా నిలిచాడని గుర్తు చేశారు. ఆయన వెంట వైస్ చైర్మన్ రాజు, సీఈవో గోపాల్, డైరెక్టర్ బాలయ్య తదితరులు ఉన్నారు.