పెబ్బేరు, ఏప్రిల్ 1 : పెబ్బేరు వ్యవసాయ మార్కెట్ యార్డులోని ఐదు వేల మెట్రిక్ టన్నుల గోదాం లో సోమవారం భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. ఇందులో పౌరసరఫరాల శాఖ గన్నీ బ్యాగులను పెద్ద ఎత్తున నిల్వ ఉంచింది. దాదాపు రూ.10 కోట్ల మేర ఆస్తి నష్టం సంభవించింది. ప్రమాదం ఎ లా సంభవించిందో నిర్ధారణ కానప్పటికీ.. అగ్ని కీలలను అదుపు చేయడానికి వనపర్తి, కొత్తకోట, గద్వా ల నుంచి వచ్చిన మూడు ఫైర్ ఇంజన్లు, స్థానిక ము న్సిపాలిటీ ట్యాంకర్లు గంటల కొద్దీ శ్రమించాల్సి వ చ్చింది. సాయంత్రం మొదలైన మంటలు రాత్రి వ రకు అదుపులోకి రాలేదు. ఈ గోదాంలో పౌరసరఫరాల శాఖ 1,280 లక్షల గన్నీ బస్తాలను నిల్వ ఉంచగా, మొదట వాటికే నిప్పంటుకుంది. ప్రమాదంలో మొత్తం బస్తాలు కాలి బూడిదయ్యాయి. వీ టి విలువ రూ.10 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేశారు.
ఈ బ్యాగులకు ఇరువైపులా మిల్లర్లకు చెందిన 84 వేల సీఎంఆర్ ధాన్యం బస్తాలుండగా.. వాటిలో కొంత మేర అగ్నికి ఆహుతయ్యాయి. వీటి నష్టాన్ని ఇంకా అంచనా వేయలేదు. గోదాం కూడా చాలా వరకు అగ్నికి ధ్వంసం కాగా, విలువపై స్పష్టత రాలేదు. ప్రమాద తీవ్రతను తగ్గించేందుకు జేసీబీలతో గోదాం గోడలను పగులగొట్టా ల్సి వచ్చింది. స్థానికులు కూడా మంటలను ఆర్పేందుకు కృషి చేశారు. కొందరు ట్యాంకర్ల యజమాను లు స్వచ్ఛందంగా నీటిని తెచ్చి ఫైర్ ఇంజన్లలో పో శారు. అయితే అదనపు కలెక్టర్ నగేశ్, మార్కెటింగ్ డీఎం స్వర్ణసింగ్, తాసీల్దార్ లక్ష్మి, ఎస్సై హరిప్రసాద్రెడ్డి, పుర కమిషనర్ ఆదిశేషు, మున్సిపల్ వైస్చైర్మన్ కర్రెస్వామి సహాయక చర్యల్లో పాల్గొన్నారు.