ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం అందనున్నది. అలంపూర్ చౌరస్తాలో రూ.23.75 కోట్లతో 100 పడకల దవాఖాన ఏర్పాటు కాబోతున్నది. ఎమ్మెల్యే అబ్రహం చొరవతో ప్రభుత్వం వైద్యశాల మంజూరు చేయగా.. ప్రస్తుతం పనులు చకచకా సాగుతున్నాయి. పనులు పూర్తయితే ఈ ప్రాంత ప్రజలు వైద్యం కోసం రాష్ట్ర సరిహద్దులు దాటి కర్నూల్కు వెళ్లాల్సిన అవసరం ఉండదు. ప్రజల చెంతకే మెరుగైన వైద్య సేవలు రానున్నాయి. అలాగే మరో రూ.10 కోట్లను పీహెచ్సీలకు సైతం కేటాయించారు.
– మహబూబ్నగర్, జనవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మహబూబ్నగర్, జనవరి 7 (నమస్తే తెలంగా ణ ప్రతినిధి) : చిన్న రోగం వచ్చినా.. అలంపూర్ నియోజకవర్గ వాసులు ఆంధ్రా ప్రాంతానికి పరుగులు పెట్టేవారు. జ్వరమొచ్చినా.. ప్రమాదం జరిగినా.. కాన్పుల కోసమైనా కర్నూల్కు వెళ్లాల్సిందే. పంటలు అమ్మాలన్నా.. కొనాలన్నా ఆంధ్రాకు వెళ్లాల్సిందే. కానీ, తెలంగాణ వచ్చాక రూపురేఖలు మా రాయి. అన్ని రంగాల్లో దూసుకుపోతున్నది. సకల సౌకర్యాలతో కార్పొరేట్ స్థాయిలో పెద్ద దవాఖాన నిర్మాణం జరుగుతున్నది. ఆంధ్రా వ్యాపారులే ఇ క్కడికి వచ్చి పంటలను కొనే పరిస్థితికి చేరుకున్నది. ఎమ్మెల్యే అబ్రహం ప్రత్యేక చొరవ తీసుకోవడంతో ప్రజల అవస్థలు తీరాయి. రూ.33 కోట్లతో వైద్య సదుపాయలను అందుబాటులోకి తీసుకొచ్చారు. రూ.23.75 కోట్ల వ్యయంతో అలంపూర్ చౌరస్తాలో వంద పడకల దవాఖాన నిర్మాణం జరుగుతున్నది. ఇందులో రూ.21.45 కోట్లతో దవాఖాన నిర్మాణం, రూ.2.30 కోట్లతో ఫర్నీచర్ ఇతర సదుపాయల కల్పనకు వినియోగిస్తున్నారు. అలంపూర్ చౌరస్తాలోని మార్కెట్ యార్డ్ సమీపంలో విశాలమైన ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు.
దవాఖాన నిర్మాణం తుదిదశకు చేరుకున్నది. ఇదేకాకుండా మరో రూ.10 కోట్లతో వివిధ పీహెచ్సీల్లో సౌకర్యా లు కల్పిస్తున్నారు. అలంపూర్ దవాఖానలో 10 ఐసీయూ బెడ్లు, ఐదు డయాలసిస్ కేంద్రాలు వ చ్చాయి. రూ.50లక్షలతో రిప్లేర్లు చేయించారు. 21 పల్లెదవాఖానాలు మంజూరుకాగా, ఇందుకోసం రూ.3.36 కోట్లు వెచ్చిస్తున్నారు. ఇక వైద్యం కోసం సరిహద్దులు దాటాల్సిన అవసరం లేకుండా చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో విద్య, వైద్యం, రహదారులు, మౌలిక సదుపాయలను కల్పిస్తున్నారు. అయిజ పీహెచ్సీలో 30 బెడ్ల దవాఖానకు రూ.80 లక్షలు, క్యాతూరు పీహెచ్సీకి రూ. 2 కోట్లు, రాజోలి పీహెచ్సీకి రూ.2 కోట్లు మంజూరయ్యాయి. రాజోలి, వడ్డేపల్లి, ఇటిక్యాల, క్యాతూ రు పీహెచ్సీల్లో రూ.81లక్షలతో మరమ్మతులు చే యించారు. రాజోలి పీహెచ్సీ కంపౌండ్వాల్ ని ర్మాణానికి అదనంగా రూ.15లక్షలు ఖర్చు చేశారు. దీంతో పల్లెదవాఖాలు, పీహెచ్సీలు, కమ్మునిటీ హెల్త్ సెంటర్లు మెరుగుపడ్డాయి. వంద పడకల దవాఖాన పూర్తయితే అలంపూర్ రూపురేఖలే మారనున్నాయి.
రూ.5 డాక్టర్గా పేరొందిన ఎమ్మెల్యే..
అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం స్వయాన డా క్టర్. కర్నూల్ ప్రాంతంలో రూ.5 డాక్టర్గా పేరు సంపాదించారు. అలంపూర్ నియోజకవర్గానికి చెందిన పేషంట్లనే ఎక్కువగా చూసేవారు. అనంత రం కాలం కలిసి రావడంతో నియోజకవర్గానికి ప్ర జాప్రతినిధిగా అయ్యే అవకాశం వచ్చింది. ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యే అయ్యారు. 20 ఏండ్లనుంచి రాజకీయాల్లో తనదైన శైలిలో సేవ చేస్తున్నారు.
రూ.వంద కోట్లతో అభివృద్ధి..
అలంపూర్ నియోజకవర్గం చాలా వెనుకబడింది. అ ప్పట్లో ఉన్న సర్కార్లు ప ట్టించుకోలేదు. 2018లో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే గా గెలిచిన తరువాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాను. ముఖ్యమంత్రి కేసీఆ ర్ ఆశీస్సులతో రూ.వంద కో ట్లతో వివిధ పనులు చేస్తున్నా ను. వైద్య సదుపాయలు అంతంతగా ఉన్న ఈ ప్రాంతంలో ముఖ్యమంత్రి అడిగిన వెంటనే వంద పడకల దవాఖానను మంజూరు చేశారు. దవాఖాన పనులు తుదిదశకు చేరుకున్నాయి. అలంపూర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్నాను.
– డా.అబ్రహం, అలంపూర్ ఎమ్మెల్యే