మహబూబ్నగర్మెట్టుగడ్డ, జనవరి 23: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నది. మున్సిపాలిటీలు, గ్రా మాల్లో ఏర్పాటు చేసిన శిబిరాల్లో కంటి పరీక్షలు చేయించుకునేందుకు క్యూ కడుతున్నా రు. జిల్లావ్యాప్తంగా మూడోరోజు సోమవా రం కంటివెలుగు కార్యక్రమం చురుకుగా సాగింది. వైద్యారోగ్యశాఖ ఆధ్వర్యంలో 45 శిబిరాలను ఏర్పాటు చేశారు. మొత్తం 8,260మందికి కంటి పరీక్షలు నిర్వహించి 1,458మందికి కండ్లద్దాలను పంపిణీ చేశా రు. మరో 875మందికి దూరంచూపు సమ స్య ఉన్నట్లు గుర్తించి కండ్లద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. మూడురోజులపాటు 22,923 మందిని పరీక్షించి 4,983 మందికి అద్దాలను అందజేశారు. అలాగే 3,160మందికి కండ్లద్దాల కోసం ఆర్డర్ చేశారు.
154మందికి పరీక్షలు
కంటివెలుగు కార్యక్రమంలో భాగంగా సోమవారం రా జాపూర్ ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో 154 మంది పరీక్షలు నిర్వహించినట్లు డాక్టర్ మధుసూదన్రావు, కోఆర్డినేటర్ శ్రీనివాసు లు తెలిపారు. దృష్టిలోపంతో బాధపడుతున్న 55మందికి కండ్లద్దాలు పంపిణీ చేయడంతోపాటు మరో 18మందికి అద్దాలు అం దజేసేందుకు ఆర్డర్ ఇచ్చినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు మౌనిక, ప్రసన్న, ఉత్తరయ్య తదితరులు పాల్గొన్నారు.
వందశాతం పూర్తికావాలి
కంటివెలుగు లక్ష్యాన్ని వందశాతం పూర్తి చేయాలని ఎంపీడీవో జయరాం సూచించారు. మండలంలోని పారుపల్లిలో కంటివెలుగు శిబిరాన్ని పరిశీలించారు. గ్రామంలో 18ఏండ్లు నిండిన ప్రతిఒక్కరికీ పరీక్షలు నిర్వహించి అవసరమైన అద్దాలు, మందులను అందజేయాలని సూచించారు. అలాగే కంటివెలుగు కార్యక్రమాన్ని డాక్టర్ నరేశ్ పర్యవేక్షించారు.
సద్వినియోగం చేసుకోవాలి
కంటివెలుగు కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ప్రోగ్రాం ఆఫీసర్ సంధ్యాకిరణ్మ యి కోరారు. మండలంలోని హస్నాపూర్, మున్సిపాలిటీలోని 3వ వార్డులో సోమవా రం కంటివెలుగు శిబిరాలను పరిశీలించా రు. 3వ వార్డులో 209మందిని పరీక్షించి 21మందికి కండ్లద్దాలను పంపిణీ చేయగా, మరో 44మందిని శస్త్రచికిత్స నిమిత్తం రెఫర్ చేసినట్లు సీహెచ్వో రామయ్య తెలిపారు. హస్నాపూర్లో 295మందికి పరీక్షలను ని ర్వహించి 31మందికి అద్దాలను అందజేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ రాములమ్మ, కౌన్సిలర్ వసంతాగోపాల్, డాక్టర్లు రాధిక, హిమబింధు, సూపర్వైజర్లు యాదమ్మ, సుధాకర్ పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
మండలకేంద్రంతోపాటు బస్వాయిపల్లిలో సోమవారం కంటివెలుగు కార్యక్రమం కొనసాగింది. ఈ సందర్భంగా డాక్టర్ శరత్చంద్ర మాట్లాడుతూ అంధత్వ నివారణ కోసం ప్రభుత్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమాన్ని అంద రూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సిబ్బంది ఉన్నారు.
బాలానగర్ మండలంలో..
మండలంలోని చిన్నరేవల్లిలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని ఎంపీవో నసీర్ పరిశీలించా రు. శిబిరంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందు లు కలుగకుండా చూడాలని సిబ్బందికి సూ చించారు. మండలకేంద్రంలో 166మందికి పరీక్షలు నిర్వహించి 34మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 40 మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ సృజన తెలిపా రు. చిన్నరేవల్లిలో 203మందికి పరీక్షలు చేసి 77మందికి కండ్లద్దాలు అందజేశారు. మరో 28 మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీచంద్రమౌళి, ఏఎన్ఎం శోభారాణి, పం చాయతీ కార్యదర్శి బాలరాజు పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
మండలకేంద్రంతోపాటు కొల్లూరు, లింగన్నపల్లి గ్రా మాల్లో కంటి పరీక్షలు నిర్వహించారు. నవాబ్పేటలో 209మందికి పరీక్షలు నిర్వహించి 37మందికి కండ్లద్దాలు అందజేశారు. 29మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. అలాగే లింగన్నపల్లిలో 171మందికి పరీక్షలు నిర్వహించి 7మందికి అద్దాలు అందజేశారు. మరో 7మందికి అద్దాల కోసం ఆర్డ ర్ చేశారు. కొల్లూరులో 188మందికి పరీక్ష లు నిర్వహించి 18మందికి కండ్లద్దాలు అం దజేశారు. 15మందికి కంటి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. మొత్తం 568మందికి కంటి పరీక్షలు నిర్వహించి 62మందికి కండ్లద్దాలను అందజేశారు. కార్యక్రమంలో ఎం పీడీవో శ్రీలత, మండల వైద్యాధికారి విజయలక్ష్మి, సర్పంచులు గోపాల్గౌడ్, నర్స మ్మ, సౌజన్య, వైద్యసిబ్బంది బీచుపల్లిగౌడ్, శ్రీనివాస్, శకుంతల, శరబలింగం, రఘు, అవినాష్ తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మండలకేంద్రంతోపాటు అయ్యవారిపల్లిలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాలను ఎంపీడీవో సాయిలక్ష్మి పరిశీలించారు. మొత్తం 419మందికి పరీక్షలు చేసి 36మందికి కండ్లద్దాలు పంపి ణీ చేసినట్లు తెలిపారు. అలాగే 35మందికి అవసరమైన కంటి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్యులు మనుప్రియ, కృష్ణకుమార్, ఎంపీవో అనురాధ, హెల్త్ సూపర్వైజర్లు దేవయ్య, జంగ య్య పాల్గొన్నారు.
కౌకుంట్ల మండలంలో..
కౌకుంట్ల మండలంలోని పేరూర్లో ఏర్పా టు చేసిన కంటివెలుగు శిబిరాన్ని తాసిల్దార్ శివరాజు పరిశీలించారు. మొత్తం 172మందికి పరీక్షలు నిర్వహించి 15మందికి కండ్లద్దాలు పంపిణీ చేసినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. మరో 12మందికి అద్దాలు అందజేసేందుకు ఆర్డర్ చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమం లో ఆర్ఐ జలాల్, సర్పంచ్ చామన్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చిన్నచింతకుంట మండలంలో..
చిన్నచింతకుంట మండలకేంద్రంతోపా టు మద్దూర్లో కంటివెలుగు శిబిరాలు కొనసా గాయి. చిన్నచింతకుంటలో 201 మంది ని పరీక్షించి 28మందికి కండ్లద్దాలు అందజేశారు. మరో 8మందికి అద్దాల కోసం ఆర్డ ర్ చేశారు. మద్దూర్లో 145మందిని పరీక్షించి 15మందికి అద్దాలను పంపిణీ చేశా రు. మరో 11మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు వైద్యసిబ్బంది తెలిపారు. కార్యక్రమంలో డాక్టర్లు సనా, సంతోష్, షఫిఖ్, రా ధిక, రాహుల్, క్యాంప్ కోఆర్డినేటర్ రాజన్న, ఖాదర్, సూపర్వైజర్ సుశీల పాల్గొన్నారు.
శిబిరాల పరిశీలన
జడ్చర్ల మున్సిపాలిటీలోని 1, 2 వార్డులు, మండలంలోని గంగాపూర్, పెద్ద ఆదిరాల గ్రామాల్లో ఏర్పా టు చేసిన కంటివెలుగు శిబిరాలను జిల్లా కో ఆర్డినేటర్ దత్తు, డాక్టర్ శ్వేత పరిశీలించారు. మున్సిపాలిటీలో ఇప్పటివరకు 1,007మందిని పరీక్షించి 263మందికి కండ్లద్దాలు అందజేసినట్లు డాక్టర్ శివకాంత్ తెలిపారు. మరో 149 మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు పేర్కొన్నారు. గంగాపూర్ పీహెచ్సీ పరిధిలో 808మందికి పరీక్షలు నిర్వహించి 178మందికి కండ్లద్దాలను అందజేసినట్లు డాక్టర్ సమత తెలిపారు. 98మందికి అద్దా ల కోసం ఆర్డర్ పెట్టినట్లు పేర్కొన్నారు.