పెద్దమందడి, మార్చి 22 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో మద్యం, నగదు సరఫరాను అరికట్టేందుకు వాహనాల తనిఖీలను పోలీసులు ముమ్మరం చేశారు. శుక్రవారం మోజర్ల సమీపంలోని జాతీయ రహదారి బుర్రవాగు స్టేజీపై ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టినట్లు ఎస్సై శివకుమార్ తెలిపారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్ నుంచి కర్నూల్కు వెళ్తున్న వాహనంలో రూ.8లక్షల నగదును పట్టుకున్నారు. ఈ డబ్బులకు ఎలాంటి ధ్రువపత్రాలు లేకపోవడంతో స్వా ధీనం చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. రూ.50వేలకు మించి నగదును తీసుకెళ్తే వాటికి సంబంధించిన ధ్రువపత్రాలను చూపించాల్సిందిగా చెప్పారు.