దేవరకద్ర, డిసెంబర్ 15 : మహబూబ్నగర్ జిల్లాలో జడ్చర్ల వ్యవసాయ మార్కెట్ తర్వాత అత్యధికంగా ఆదాయం వచ్చే మార్కెట్ల్లో దేవరకద్ర ఒకటి. వానకాలం, యాసంగిలో రైతులు పండించిన ధాన్యం పెద్దఎత్తున క్రయవిక్రయాలు జరుగుతుండటంతో మంచి ఆదాయం వస్తుంది. దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ పదవీ కాలం పూర్తయి 3నెలలు గడుస్తుంది. మార్కెట్ చైర్మన్ పదవి కోసం మండలంలో ఆశావాహులు రోజురోజుకూ పెరిగిపోతున్నారు. మార్కెట్ పరిధిలో చిన్నచింతకుంట, దేవరకద్ర మండలాలకు చెందిన నాయకులు చైర్మన్ పదవి కోసం ఆరాటపడుతున్నారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మార్కెట్ చైర్మన్గా జనరల్, ఎస్సీల వర్గాలకు చెందిన వారికి పదవులు వచ్చాయి. ఈసారి బీసీ సామాజికవర్గానికి వచ్చే అవకాశం ఉండటంతో బీసీ వర్గంలో చాలా మంది నాయకులు మార్కెట్ చైర్మన్ పదవి కోసం పోటీపడుతున్నారు. దీంతో ఎవరికి వారే చైర్మన్ పదవికి ప్రయత్నాలు చేస్తున్నారు.
మార్కెట్ ఏర్పడినప్పటి నుంచి దేవరకద్ర మండలానికి చెందిన నాయకులు పదవిని చేపడుతున్నారు. మార్కెట్కు చిన్నచింతకుంట మండ లం కూడా అనుబంధం ఉండటంతో ఈ సారి చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు చిన్నచింతకుంట నాయకులు పావులు కదుపుతున్నారు. చైర్మన్ పదవి కోసం బీసీ వర్గానికి చెందిన నాయకులు ఎమ్మెల్యే, మంత్రులను కలిసి తమకే చైర్మన్ పదవి వచ్చేలా ముమ్మర యత్నాలు చేస్తున్నారు. మార్కెట్ చైర్మన్ పదవి ఎంపిక ఆలస్యం అవుతుండటంతో రోజురోజుకూ నాయకుల్లో ఉత్కం ఠ పెరిగిపోతుంది. అలాగే మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ప్రతిసారి చిన్నచింతకుంట మం డల నాయకులకే ఇస్తున్నారు. దీంతో వైస్ చైర్మన్ పదవి కోసం కూడా పైరవీలు చేస్తున్నట్లు సమాచారం. ఏదేమైనా చై ర్మన్ పద వి ఎవరికీ వరించునో వేచిచూడాలి.
పెరిగిన డైరెక్టర్ పోస్టులు
దేవరకద్ర మార్కెట్లో డైరెక్టర్ పోస్టులు గతంలో 12 పోస్టులు ఉండగా ప్రస్తుతం 18కి పెరగడంతో పదవి కోసం ఆశావాహు లు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు.