మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 6 : ప్రభు త్వం చేపట్టిన కంటివెలుగు కార్యక్రమానికి విశేష స్పం దన లభిస్తున్నది. సోమవారం జిల్లావ్యాప్తంగా 7,18 6మందికి పరీక్షలు నిర్వహించి 852మందికి కండ్లద్దాలను పంపిణీ చేశారు. దూరంచూపు సమస్య ఉన్న 561మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. ఇప్పటివరకు 93,588మందిని పరీక్షించి 13,864 మందికి అద్దాలను పంపిణీ చేశారు. పలు శిబిరాలను జిల్లా క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ మోతీలాల్ పరిశీలించారు.
ముమ్మరంగా..
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 6 : జడ్చర్ల మున్సిపాలిటీతోపాటు మండలంలోని చర్లపల్లి, గంగాపూర్ గ్రామాల్లో కంటి పరీక్షలు నిర్వహించారు. చర్లపల్లిలో 200మందిని పరీక్షించి 18మందికి కండ్లద్దాలను పంపిణీ చేశా రు. మరో 12మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. గంగాపూర్లో 137మందికి పరీక్షలు నిర్వహించి ఐదుగురికి అద్దాలు పంపిణీ చేశారు. మరో 12మందికి అ ద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు డాక్టర్ సమత తెలిపారు. అదేవిధంగా మున్సిపాలిటీలోని నాలుగోవార్డులో 160మందికి పరీక్షలు నిర్వహించి 36మందికి అద్దాలను అందజేశారు. మరో 15మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. 15వ వార్డులో మొత్తం 145మందికి పరీక్షలు నిర్వహించి 39మందికి అద్దాలు పంపిణీ చేశా రు. మరో 9మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు అర్బన్ హెల్త్సెంటర్ డాక్టర్ శివకాంత్ తెలిపారు.
సద్వినియోగం చేసుకోవాలి
హన్వాడ, ఫిబ్రవరి 6 : కంటివెలుగు కార్యక్రమాన్ని మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ బాలరాజు కోరారు. మండలంలోని ఇబ్రహీంబాద్లో కంటివెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో సింగిల్విండో వైస్చైర్మన్ కృష్ణయ్యగౌడ్, సర్పంచ్ వసంత, ఎంపీడీవో ధనుంజయగౌడ్, తాసిల్దార్ శ్రీనివాసులు, నాయకులు రమణారెడ్డి, శ్రీనివాసులు, వాసు, యాదయ్య పాల్గొన్నారు.
నవాబ్పేట మండలంలో..
నవాబ్పేట, ఫిబ్రవరి 6 : మండలకేంద్రంలో 209మందికి కంటి పరీక్షలు నిర్వహించి 8మందికి అద్దాలు అందజేశారు. ఐదుగురికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. కాకర్జాలలో 185మందిని పరీక్షించి 30మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 22మందికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. యన్మన్గండ్లలో 227 మందికి పరీక్షలు నిర్వహించి 45మందికి అద్దాలను అందజేశారు. 22మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టా రు. మొత్తం 621మందికి కంటి పరీక్షలు నిర్వహించి 83మందికి అద్దాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో వైద్యసిబ్బంది బీచుపల్లిగౌడ్, శకుంతల, శ్రీనివాస్, శరభలింగం, అవినాశ్ పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, ఫిబ్రవరి 6 : మండలకేంద్రంలో 233 మందికి పరీక్షలు నిర్వహించి 14మందికి కండ్లద్దాలు పంపిణీ చేశారు. మరో 17మందికి అద్దాల కోసం ఆర్డర్ చేసినట్లు డాక్టర్ సృజన తెలిపారు. అలాగే పెద్దరేవల్లిలో 154మందిని పరీక్షించి 66మందికి అద్దాలు పంపిణీ చేసినట్లు పేర్కొన్నారు. మరో 26మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టినట్లు తెలిపారు.
మిడ్జిల్ మండలంలో..
జడ్చర్ల(మిడ్జిల్), ఫిబ్రవరి 6 : మిడ్జిల్ మండలకేంద్రంతోపాటు కొత్తపల్లిలో కంటివెలుగు శిబిరాలు కొనసాగాయి. కొత్తపల్లిలో 149మందిని పరీక్షించి 10మందికి అద్దాలను పంపిణీ చేశారు. మరో ఆరుగురికి అద్దాల కోసం ఆర్డర్ చేశారు. మిడ్జిల్లో 210మందిని పరీక్షించి 9మంది అద్దాలను పంపిణీ చేశారు. మరో 20మందికి అద్దాల కోసం ఆర్డర్ పెట్టారు. కార్యక్రమంలో డాక్టర్ మనుప్రియ, కృష్ణకుమార్, సిబ్బంది దేవయ్య, జంగయ్య పాల్గొన్నారు.
దేవరకద్ర మండలంలో..
దేవరకద్ర, ఫిబ్రవరి 6 : కంటివెలుగు కార్యక్రమం లో భాగంగా మండలంలో 277మందికి పరీక్షలు ని ర్వహించి అవసరమైన అద్దాలను అందజేసినట్లు డాక్టర్ శరత్చంద్ర తెలిపారు.
మహ్మదాబాద్ మండలంలో..
మహ్మదాబాద్, ఫిబ్రవరి 6 : మండలంలోని కంచన్పల్లిలో ఏర్పాటు చేసిన కంటివెలుగు శిబిరాన్ని స ర్పంచ్ అనెమోని అంజిలయ్య ప్రారంభించారు. మహ్మదాబాద్, కంచన్పల్లి గ్రామాల్లో 393మందికి కంటి పరీక్షలు నిర్వహించినట్లు మండల వైద్యాధికారి మహ్మద్ తెలిపారు. కార్యక్రమంలో ఎంపీటీసీ లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి సుభద్ర పాల్గొన్నారు.