ఎక్సైజ్శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్
టీఆర్ఎస్లో చేరిన 500 మంది బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ నాయకులు
మహబూబ్నగర్, జూలై 8 : పెయింటర్లకు టీఆర్ఎస్ సర్కార్ అండగా ఉంటుందని ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో శుక్రవారం మంత్రి శ్రీనివాస్గౌడ్ సమక్షంలో బిల్డింగ్, పెయింటర్స్ అసోసియేషన్ జిల్లా (తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంఘం అనుబంధం) అధ్యక్షుడు విశ్వనాథం ఆధ్వర్యంలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన 500 మంది టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసగౌడ్ మాట్లాడుతూ పెయింటర్లకు సమావేశాలు నిర్వహించుకునేందుకు వీలుగా అనువైన స్థలాన్ని కేటాయించి.. అందులో భవన నిర్మాణానికి రూ.5లక్షలు మంజూరు చేసేందుకు కృషి చేస్తానన్నారు. ప్రతి పెయింటర్ను కార్మికుడిగా గుర్తించేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్సూరెన్స్తోపాటు పిల్లల చదువులు, పెండ్లిళ్లకు ఆర్థికసాయం చేస్తామన్నారు. క్రమశిక్షణతో పార్టీ నిబంధనలను పాటిస్తూ ముందుకు సాగుదామని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. టీఆర్ఎస్లో చేరిన వారిలో బిల్డింగ్, పెయింటర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ.జాఫర్, కోశాధికారి సత్యంగౌడ్, గౌరవాధ్యక్షుడు వెంకటేశ్, ఉపాధ్యక్షుడు భీమేశ్గౌడ్, నసీర్, టి.సూరి, కమల్, అయ్యప్ప, ఆంజనేయులు, శ్రీను, భాస్కర్ తదితరులు ఉన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, కౌన్సిలర్ కిశోర్, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు శివరాజ్ తదితరులు పాల్గొన్నారు.
అధునాతనంగా రేడియాలజీ భవనం
ప్రభుత్వ జనరల్ దవాఖానలో మరింత మెరుగైన వైద్యసేవలందించేందుకు అధునాతన టెక్నాలజీతో రేడియాలజీ భవనం నిర్మిస్తున్నామని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. శుక్రవారం మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో రూ.75 లక్షలతో నిర్మించనున్న రేడియాలజీ ల్యాబ్ పనులను కలెక్టర్ వెంకట్రావుతో కలిసి ప్రారంభించారు. అనంతరం దవాఖానలోని అత్యవసర విభాగంలో చికిత్స పొందుతున్న రోగులను పరామర్శించారు. కార్యక్రమంలో దవాఖాన సూపరింటెండెంట్ రాంకిషన్, మెడికల్ కళాశాల డైరెక్టర్ నవకళ్యాణి, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, కౌన్సిలర్ నీరజ, టీఎంఎస్ఐడీ అధికారులు, దవాఖాన డెవలప్మెంట్ కమిటీ మెంబర్ లక్ష్మి, డిప్యూటీ సూపరింటెండెంట్ జీవన్, కౌన్సిలర్ కిశోర్, కిరణ్ప్రకాశ్, డీఎస్పీ మహేశ్ ఉన్నారు.
మహిళల అభివృద్ధే ధ్యేయం
మహిళల అభివృద్ధే సర్కార్ ధ్యేయమని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ రూరల్ మండలం జైనల్లీపూర్ గ్రామంలో రాష్ట్ర భవన నిర్మాణ, ఇతర కార్మికుల సంక్షేమ మండలి జిల్లా శాఖ ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ నేర్చుకున్న మహిళలకు ఉచితంగా మిషన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ టైలరింగ్లో మెళకువలు నేర్చుకొని ఆర్థికంగా వృద్ధి చెందాలన్నారు. న్యాక్, కార్మిక శాఖ ఆధ్వర్యంలో మహిళలకు అత్యుత్తమ ఉపాధినిచ్చే శిక్షణ కోర్సులను మహబూబ్నగర్లో ప్రయోగాత్మకంగా ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జైనల్లీపూర్ గ్రామంలో రూ.10లక్షలతో చేపట్టిన సీసీరోడ్డు పనులను ప్రారంభించారు. అదేవిధంగా రూ.5లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్, మరో రూ.5లక్షలతో నిర్మించనున్న డ్వాక్రా సంఘం భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. తువ్వగడ్డతండాలో రూ.9.55 లక్షలతో నిర్మించిన తాగునీటి ట్యాంక్ను ప్రారంభించారు. రూ.2 లక్షలతో బస్షెల్టర్ నిర్మాణానికి భూమిపూజ చేశారు. భవానిగడ్డతండాలో రూ.85 లక్షలతో నిర్మించిన బీటీరోడ్డు పనులను ప్రారంభించారు.