మహబూబ్నగర్, మార్చి 7 : ప్రభుత్వ శాఖలన్నింటిలోనూ 40-50 శాతం మహిళా ఉద్యోగులు విధులు నిర్వహించడం శుభపరిణామమని మహబూబ్నగర్ కలెక్టర్ రవినాయక్ అన్నారు. గురువారం కలెక్టరేట్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవా న్ని నిర్వహించగా కలెక్టర్ హాజరై మాట్లాడా రు. మహిళా అభివృద్ధి, సంక్షేమం కోసం ప్ర భుత్వం గ్రామ, మండల, జిల్లా స్థాయిలో ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నదన్నా రు. మహిళలు నేడు అన్ని రంగాల్లో రాణిస్తున్నారన్నారు. అనంతరం జువైనల్ జస్టిస్ బోర్డు మెంబర్ ఎస్తేర్ గ్రేస్ మాట్లాడుతూ ప్ర తి స్త్రీ ఆర్థికంగా ముందడుగు వేస్తూ ఒక శక్తి గా మారాలని సూచించారు.
అనంతరం ప్ర భుత్వ శాఖల్లో ఉన్నత స్థాయిలో సేవలందిస్తున్న బీసీ సంక్షేమశాఖ అధికారి ఇందిర, డీ సీవోఏ పద్మ, జేబీబీ మెంబర్లు గిరిజ, ఎస్తేర్ గ్రేస్, డీపీఎం నాగవల్లికలను ఘనంగా సత్కరించి వివిధ అంశాల్లో ప్రతిభ కనబర్చిన వా రికి ప్రశంసాపత్రాలను అందజేశారు. అదేవిధంగా మహిళా పారిశుధ్య కార్మికులను శాలువాలు, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో డీఆర్డీవో నర్సింహులు, డీఈవో రవీందర్, డీడబ్ల్యూవో జరీనాబేగం, అంగన్వాడీ టీచర్లు తదితరులు ఉన్నారు.