గద్వాల/అయిజ, సెప్టెంబర్ 23 : కర్ణాటకలోని ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణానదికి వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపుర ప్రాజెక్టుల నుంచి వరద నీటిని దిగువకు విడుదల చేస్తుండడంతో జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో వస్తోన్నది. మంగళవారం జూరాల ప్రాజెక్టుకు ఇన్ఫ్లో 3,36,000 క్యూసెక్కులు ఉండగా, జల విద్యుత్ ఉత్పత్తికి 25,783 క్యూసెక్కులు విడుదల చేస్తుండగా, 45 గేట్లు ఎత్తి దిగువకు 3,16,620 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
అదేవిధంగా నెట్టెంపాడుకు 750, ఎడమ కాల్వకు 390, కుడి కాల్వకు 580 క్యూసెక్కులు విడుదల చేయగా జూరాల ప్రాజెక్టు మొత్తం అవు ట్ ఫ్లో 3,44,192 క్యూసెక్కులుగా నమోదైంది. జూరాల పూర్తిస్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.810 టీఎంసీల నిల్వ ఉండగా, పూర్తిస్థాయి నీటి మట్టం 318.516 అడుగులకు గానూ ప్రస్తుతం 318.100 అడుగుల నీటి మట్టం ఉన్నది.
కర్ణాటకలోని తుంగభద్ర డ్యాంకు ఇన్ఫ్లో 10,632 క్యూసెక్కులు ఉండగా, అవుట్ఫ్లో 10,427 క్యూసెక్కులు నమోదైంది. 105.788 టీఎంసీల సామర్థ్యం కలిగిన టీబీ డ్యాంలో ప్రస్తుతం 80.00 టీఎంసీల నీటి నిల్వ ఉండగా, 1633 అడుగుల నీటి మట్టానికి గానూ 1626.06 అడుగులు ఉంది. అలాగే ఆర్డీఎస్ ఆనకట్టకు ఇన్ఫ్లో 20,631 క్యూసెక్కులు ఉండగా, ప్ర ధాన కాల్వకు 579 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. దిగువన ఉన్న సుంకేసుల బరాజ్కు 20,052 క్యూసెక్కుల నీరు చేరుతున్నది.
నిండుకుండలా శ్రీశైలం
శ్రీశైలం, సెప్టెంబర్ 23 : కృష్ణమ్మకు వరద భారీ గా చేరుతుండడంతో శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండను తలిపిస్తున్నది. మంగళశారం ఎగువ నుంచి ఇన్ఫ్లో 3,98, 815 క్యూసెక్కులు రాగా ప్రాజెక్టులోని 10 గేట్లు 14 అడుగుల మేర ఎత్తి 3,49,620 క్యూసెక్కులు నాగార్జున సాగర్కు విడుదల చేస్తున్నారు. అదేవిధంగా కుడి, ఎడ మ జల విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా 65, 482 క్యూసెక్కులు దిగువకు విడుదల చేయగా మొత్తం అవుట్ఫ్లో 4,15,102 క్యూసెక్కులు నమోదైంది. జలాశయం పూర్తిస్థాయి నీటినిల్వ 885అడుగులు కాగా ప్రస్తు తం 882. 90 అడుగులు ఉండగా నీటిసామర్థ్యం 215.807 టీఎంసీలు కాగా 203.8907 టీఎంసీలు ఉన్నాయి.