Mahaboobnagar : మహబూబ్ నగర్లోని న్యూ మోతీనగర్లో పలువురు అస్వస్థతకు గురయ్యారు. పెళ్లి భోజనం వికటించడంతో 30 మందికిపైగా వాంతులు చేసుకున్నారు. దాంతో, వారిని వెంటనే ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ముప్ఫయి మందికి పైగా అనారోగ్యంతో బాధ పడడానికి కారణం పాడైన పెళ్లి భోజనాలను తినడమే కారణమని తెలిసింది.
గురువారం కొందరు పెళ్లిలో మిగిలిన భోజనాలను న్యూ మోతీనగర్ బస్తీవాసులకు ఇచ్చి వెళ్లారు. శుక్రవారం ఆ ఆహారం తిన్నవారు అస్వస్థతకు లోనై వాంతులు చేసుకున్నారు. ఈ ఘటనపై పోలీసులు, వైద్య అధికారులు విచారణ జరుపుతున్నారు.