బిజినేపల్లి, జనవరి 9 : అర్హులైన ప్రతిఒక్కరికీ సంక్షేమ పథకాలు అందుతాయని, దుష్ప్రచారాలు నమ్మొద్దని ఎమ్మెల్యే మర్రి జనార్దన్రెడ్డి తెలిపారు. సోమవారం మండలంలో గౌరారం, గౌరారం తండాల్లో గుడ్మార్నింగ్ నాగర్కర్నూల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో నూతన పాఠశాల భవనం జూన్ నాటికి పూర్తి చేస్తామన్నారు. డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం కోసం రూ.20 లక్షలు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 15 రోజుల్లో సమస్యలన్నీ పరిష్కరిస్తామన్నారు. ఉగాది నుంచి అర్హులైన ప్రతిఒక్కరి ఇంటి నిర్మాణానికి రూ.3 లక్షలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ముదిరాజ్, ఎస్సీ కమ్యూనిటీ భవనాల కోసం రూ.5 లక్షల చొప్పున రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్లు వివరించారు. రెవెన్యూ సమస్యలు, 44 సర్వే నెంబర్లో ఉన్న రైతులందరికీ పట్టాదారు పాస్పుస్తకాలు అందేలా చూస్తామని హామీ ఇచ్చారు. అర్హులందరికీ ఆసరా పింఛన్లు అందజేయాలని ఎంపీడీవోకు సూచించారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ జక్కా రఘునందన్రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ కుర్మయ్య, ఎంపీపీ శ్రీనివాస్గౌడ్, నాయకులు శ్రీశైలం, ప్రశాంత్, మహేశ్వర్రెడ్డి విజయ్, ఎల్లస్వామి, సాదిక్పాషా, తయాబ్, అధికారులు పాల్గొన్నారు.