మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఫిబ్రవరి 9 : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఆర్థోపెడిక్ వి భాగం ఆధ్వర్యంలో మోకీలు మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా 25 మందికి చేసినట్లు సూపరిటెండెంట్ డా క్టర్ రాంకిషన్ తెలిపారు. గురువారం ఆర్థోపెడిక్ విభాగం లో మోకీలు శస్త్రచికిత్స చేసుకున్న వారితో కలిసి కేక్ కట్చేసి మెరుగైన వైద్యం అందించిన వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా రాంకిషన్ మాట్లాడుతూ రాష్ట్ర ఏర్పడిన తర్వాత పేదలకు అధునాతన, మెరుగైన వైద్యసేవలు అందుతున్నాయని స్పష్టం చేశారు. మోకీలు మా ర్పిడికి వచ్చే రోగులకు ప్రతి గురువారం ఉదయం 9 నుం చి మధ్యాహ్నం 2 గంటల వరకు ప్రత్యేక పరీక్షలు నిర్వహిస్తామన్నారు.
2017లో జనరల్ దవాఖానగా వివిధ విభాగాలు ఏర్పాటు చేశామని, నాటి నుంచి ప్రైవేట్కు దీటుగా వైద్య సేలు అం దుతున్నట్లు తెలిపారు. మోకీలు మార్పిడి ప్రైవేట్ వైద్యశాలల్లో రూ.లక్షల్లో ఖర్చు అవుతుందని, కానీ మంత్రి శ్రీనివాస్గౌడ్ సహకారంతో ఆర్థోపెడికల్ విభాగాధిపతి రాంకిషన్ ఆధ్వర్యంలో వైద్య బృందం, అనిస్తీషియా, జనరల్ మెడిసిన్, రేడియాలజీ, ఫిజియోథెరపీ విభాగాలకు చెందిన బృందం సాయంతో ఇప్పటి వరకు 25 మోకీల మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా చేసిసన ట్లు తెలిపారు. తెల్లరేషన్ కార్డు ఉన్న వారికి ఉచితంగా ఆపరేషన్లు చేశామన్నారు.
ప్రైవేట్ దవాఖానలకు వెళితే సు మారు రూ.2 లక్షలు నుంచి రూ.4 లక్షల అవుతాయని చెప్పారు. రోగులు తమ వెంట ఆరోగ్యశ్రీ లేదా తెల్లరేషన్ కార్డు, ఉద్యోగులు ఈహెచ్ఎస్ కార్డుతో రావాలని సూచించారు. కార్యక్రమంలో జనరల్ మెడిసిన్ విభాగాధిపతి వైద్య బృదం డాక్టర్ అమరావతి, రేడియాలాజీ విభాగధిపతి హన్మత్ ప్రసాద్, అనిస్తిషియా విభాగాధిపతి డా. రవికుమార్, ఆర్థో ఆసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్లు తులసీరాం, నరేందర్, పరమేశ్వరి, ఉదయ్, పాషా, దినేశ్, రాజు, ఆరోఎంవోలు సిరాజుద్దీన్, లక్ష్మణ్, నగేశ్, శిరీష, ఆర్థో ఆపరేషన్ ఓటీ హెడ్నర్సు విజయలక్ష్మి, నర్సు నిర్మల ఉన్నారు.